ఎర్రటిరంగు వస్త్రంలో బడ్జెట్ పత్రాలు, పార్లమెంటులో నిర్మల కూతురు

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. శనివారం (ఫిబ్రవరి 1) ఉదయం 11 గంటలకు ఆమె బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. గత బడ్జెట్ మాదిరిగానే ఆమె ఎరుపు రంగు సంచిలో బడ్జెట్ పత్రాలను తీసుకు వచ్చారు. నిర్మల బడ్జెట్ వినేందుకు ఆమె కుటుంబ సభ్యులు పార్లమెంటుకు వచ్చారు. ఆర్థికమంత్రి కూతురు పరకాల వాజ్మయి కూడా ఉన్నారు. పార్లమెంటు సిబ్బంది, అధికారులు వీరిని సాదరంగా ఆహ్వానించారు.

2020-21 బడ్జెట్ వేతనజీవులకు, సామాన్యులకు ఊరట కలిగించేలా ఉండాలని కాంగ్రెస్ ఆకాంక్షించింది. 2020 సార్వత్రిక బడ్జెట్లో వేతన జీవులకు పన్నుల భారం నుంచి ఉపశమనం కల్పించాలని ఆశిస్తున్నానని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. సామాన్యుడికి చేయూతనిచ్చేలా గ్రామీణ భారతంలో పెట్టుబడులకు తలుపులు తెరవాలని చెప్పారు. నోట్ల రద్దు నాటి నుంచి సంక్షోభంలో చిక్కుకున్న పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నామన్నారు.

మరిన్ని బడ్జెట్ కథనాలు

Budget 2020: Sitharamans Red budget bahi Khata, FM family including her daughter in Parliament

నిరుద్యోగం, మందగమనం సమయంలో నిర్మలా సీతారామన్ 2020-21 కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టారు. సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ పై దేశ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆదాయపన్ను పరిమితి పెంచుతారని, రైతుల సంక్షేమానికి మేలు చేసే పథకాలు ప్రవేశపెడతారని, ఆటోమొబైల్ పరిశ్రమపై జీఎస్టీ తగ్గించి దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేలా ఉంటుందని కోరుకుంటున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+