Budget 2020: ఆదాయాలు పెంపు, ప్రజలకు 4 శాతం ఆదా

ఢిల్లీ: ప్రజల ఆదాయాలు పెంపు, కొనుగోలు శక్తిని పెంచే దిశగా తాము బడ్జెట్‌ను తీసుకు వచ్చామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. శనివారం ఉదయం పదకొండు గంటలకు ఆమె బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. భారీ మెజార్టీతో అధికారం అప్పగించినట్లు చెప్పారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో తాము మరింత ఉత్సాహంగా పని చేస్తున్నామన్నారు.

ఇది సామాన్యుల బడ్జెట్ అన్నారు. దేశ ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టామన్నారు. జాతి నిర్మాణంలో యువత, మహిళలు అందరిదీ కీలక పాత్ర అన్నారు. ప్రజల ఆదాయం పెంపు, కొనుగోలు శక్తి పెంచేలా ఈ బడ్జెట్‌లో మరిన్ని చర్యలు చేపట్టినట్లు చెప్పారు. యువతను మరింత శక్తిమంతంగా చేసేలా ఉంటాయన్నారు.

 Budget 2020: Average household now saves 4 percent

ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని, ద్రవ్యోల్భణం అదుపులో ఉందని చెప్పారు. నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. జీఎస్టీ చారిత్రాత్మక సంస్కరణ అన్నారు. జీఎస్టీ అమలు తర్వాత సామాన్యులకు నెలవారీ ఖర్చులు 4 శాతం ఆదా అయినట్లు తెలిపారు.

మరిన్ని బడ్జెట్ కథనాలు

కాగా, వన్ నేషన్, వన్ ట్యాక్స్ నినాదంతో తీసుకువచ్చిన జీఎస్టీ మంచి ఫలితాలను తీసుకు వచ్చిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. పన్ను చెల్లింపులను మరింత సరళతరం చేస్తామన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి తన బడ్జెట్ ప్రసంగంలో పన్ను చెల్లింపుల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+