న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికం సంస్థ BSNL సూపర్ ఆఫర్తో ముందుకు వచ్చింది. సాధారణంగా మనం చేసే ఫోన్ కాల్కు టెలికం ఆపరేటర్లు కొంత మొత్తం వసూలు చేస్తాయి. జియో వచ్చిన తర్వాత పోటీ కారణంగా ఉచితంగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ బీఎస్ఎన్ఎల్ మాత్రం రివర్స్ రూట్లో వస్తోంది. మీరు మాట్లాడే ప్రతి 5 నిమిషాలకు గాను 6 పైసలు మీ అకౌంట్లో వేస్తుంది. ఈ అద్భుతమైన అవకాశం బీఎస్ఎన్ఎల్ వైర్ లైన్, బ్రాడ్బాండ్, FTTH కస్టమర్లకు వర్తిస్తుంది. సబ్స్క్రైబర్లకు ఆ డబ్బులు క్యాష్ బ్యాక్ రూపంలో అందుతాయి.

జియో యూజర్ల అసంతృప్తి... బీఎస్ఎన్ఎల్ ఆశలు
టెలికం రంగంలో ప్రయివేటు సంస్థల హవా కొనసాగుతోంది. అలాగే, ల్యాండ్ లైన్ ఉపయోగించే వారి సంఖ్య భారీగా పడిపోయింది. కస్టమర్ల పరంగా, ఆర్థికపరంగా బీఎస్ఎన్ఎల్ ఇబ్బందులకు ఇవి కూడా కారణం. ఈ నేపథ్యంలో తమ ఈ ప్లాన్ కస్టమర్లు పెరిగేందుకు ఉపయోగపడుతుందని భావిస్తోంది. ముఖ్యంగా జియో కారణంగా మరో సంస్థ వైపు చూస్తున్న వారు తమవైపు వస్తారని భావిస్తోంది. జియో యూజర్లకు IUC ఛార్జీల కింద నిమిషానికి 6 పైసలు ఛార్జ్ చేస్తోన్న విషయం తెలిసిందే. జియో యూజర్లు ఈ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో బీఎస్ఎన్ఎల్ ఈ సమయాన్ని క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది.

6 పైసలు ఇస్తాం...
దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ కస్టమర్లకు ఒక నెల పాటు ఉచిత బ్రాండ్ బ్యాండ్, వైఫై సేవలు అందించనున్నట్లు కన్స్యూమర్ ఫిక్స్డ్ యాక్సిస్ (CFA) ఎండీ (ఢిల్లీ) వివేక్ బాంజాల్ తాజాగా తెలిపారు. ల్యాండ్ లైన్ కస్టమర్లు ఏ ఆపరేటర్కు అయినా 5 నిమిషాల కంటే పైన అవుట్ గోయింగ్ మాట్లాడితే 6 పైసలు కస్టమర్లకే తిరిగి తాము చెల్లిస్తామని, అలా ఎన్ని కాల్స్ మాట్లాడినా చెల్లిస్తామని చెప్పారు.

నెక్స్ట్ జనరేషన్ నెట్ వర్క్కు అప్ గ్రేడ్
డిజిటల్ యుగంలో కస్టమర్లు వాయిస్, డేటా సర్వీస్ కోసం నాణ్యతను కోరుకుంటున్నారని, బీఎస్ఎన్ఎల్ను నెక్స్ట్ జనరేషన్ నెట్ వర్క్కు అప్ గ్రేడ్ చేశామని, వైర్ లైన్లో జరిగే వాయిస్ కాల్ నాణ్యతను తమ కస్టమర్లు ఆనందిస్తారని భావిస్తున్నామని వివేక్ బంజాల్ అన్నారు.

ఉచిత బ్రాడ్ బ్యాండ్ ప్లాన్
ఉచిత బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ను రానున్న నెల రోజుల పాటు 10Mbps స్పీడ్తో రోజుకు 5GB వరకు ఉచితంగా ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చునని చెప్పారు. ఆ తర్వాత కనీస ప్లాన్ నెలకు రూ.349 (రోజుకు 2GB, 8Mbps స్పీడ్) నుంచి మొదలవుతుందని చెప్పారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో 4G సేవలు ప్రారంభమైనట్లు సీఎఫ్ఏ చెప్పారు. త్వరలో మొత్తం రాష్ట్రంలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఫైబర్ కనెక్టివిటీతో కేబుల్, ఇతర డేటా సేవలు అందించే సంస్థల భాగస్వామ్యంతో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్, వైఫై కనెక్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో తొలి ప్రయత్నంగా విశాఖలో వీటిని ప్రారంభిస్తామన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications