Income from BSNL: ప్రముఖ ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL తిరిగి పుంజుకుంటోంది. పూర్వ వైభవం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. జియో, ఎయిర్టెల్ వంటి దిగ్గజ ప్లేయర్స్ కు గట్టి పోటీ ఇస్తూ చౌకైన రీఛార్జి ప్లాన్స్ తాజాగా ప్రవేశపెట్టింది. నెట్వర్క్ విషయంలో ఇంకా వెనకబడి ఉన్నప్పటికీ ఇటీవలే 5G రోల్ అవుట్ కు సర్వం సిద్ధం చేసుకుంది. దీంతో ప్రజలు కూడా గట్టిగా సొమ్ము చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
భారీ స్థాయి విస్తరణ ప్లాన్లో భాగంగా పెద్ద ఎత్తున మొబైల్ టవర్స్ ఇన్స్టాల్ చేసేందుకు BSNL రెడీ అవుతుంది. ఇందుకుగాను దేశవ్యాప్తంగా స్థలం అవసరం అవుతుంది. ప్రజలు ఎవరైనా తమ బిల్డింగ్స్ పైన సెల్ టవర్ ఇన్స్టాల్ చేసేందుకు అంగీకరిస్తే, వారికి ప్రతినెలా అద్దె చెల్లించేందుకు చూస్తోంది. ఈ విధంగా చక్కని ఆదాయ మార్గాన్ని ఈ టెలికాం సంస్థ ప్రజల ముందుకు తీసుకొచ్చింది.

దీనికోసం ముందుగా ఇండస్ టవర్స్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ల్యాండ్ ఓనర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. వివరాలు పూర్తి చేసిన పిమ్మట ఇండస్ టవర్స్ ప్రతినిధులు మీ ఇంటికి సర్వే నిమిత్తం వస్తారు. తమ నియమ, నిబంధనలను వివరిస్తారు. వాటిని ఇరుపక్షాలు అంగీకరించినట్లయితే టవర్ ఇన్స్టాలేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ సర్వే జరిగే సమయంలోనే నెలవారీ అద్దె, కాంట్రాక్టు వ్యవధి వంటి వివరాలు కూడా చర్చించుకోవాల్సి ఉంటుంది.
ఇంటిపై మొబైల్ టవర్ ఇన్స్టాల్ చేయడం వల్ల ఆదాయంతో పాటు సదరు నెట్వర్క్ రీఛార్జ్లు కూడా ఉచితంగా పొందవచ్చు. ఇలా రెండు రకాల బెనిఫిట్స్ సొంతం అవుతాయి. అయితే ఈ లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయనే విషయాన్ని ఆశావహులు గ్రహించాల్సి ఉంటుంది.
అవేంటంటే మొబైల్ టవర్స్ ఎక్కువగా రేడియేషన్ విడుదల చేస్తాయి. దీర్ఘకాలంలో ఇది పలు రకాల క్యాన్సర్స్కు కారణం అవుతాయి. అంతేకాకుండా నిద్రలేమి, తలనొప్పి, ఒత్తిడి వంటి రుగ్మతలు తలెత్తే అవకాశం ఉంది. వీటన్నిటినీ పరిగణలోనికి తీసుకున్న తర్వాతే ఈ విషయంలో ముందుకు వెళ్తే బాగుంటుందని గుర్తుంచుకోవాలి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications