BSNL 4G: ప్రస్తుతం దేశీయ టెలికాం వ్యాపారంలో పెద్ద మార్పులు వస్తున్నాయి. వినియోగదారులు జియో రేట్ల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని తర్వాత మిగిలిన ప్రైవేట్ ఆపరేటర్లు సైతం తమ టారిఫ్ రేట్లను పెంచటంతో పెంపులను వ్యతిరేకిస్తున్న లక్షలాదిమంది బీఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అయ్యేందుకు క్యూ కడుతున్నారు.
వాస్తవానికి దేశీయ భడా టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్ టెల్, వొడఫోన్ ఐడియాలు వరుసగా తమ రీచార్జ్ ప్లాన్ రేట్లను పెంచి మెుబైల్ యూజర్లపై భారీ భారాన్ని మోపాయి. ఇది అనూహ్యంగా BSNLకి కలిసొస్తోంది. దేశంలోని అనేక చోట్ల ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. BSNL 4G టెక్నాలజీని గర్వంగా చూడాలని కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. అయితే కంపెనీ 4జీ సర్వీసును ఎప్పుడు ప్రారంభించనుందన్న విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే సాధ్యమైనంత త్వరలో 4జీ, 5జీ సేవలను ప్రారంభిస్తాయని హామీ ఇచ్చారు.

దేశంలోని కోట్లాది మంది వినియోగదారులకు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టాటాలు ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ కు సహకరిస్తున్నారు. ఈ క్రమంలో తేజస్, బీఎస్ఎన్ఎల్, టీసీఎస్, సీడీఓటీ కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయని సింధియా పేర్కొన్నారు. భారత్లో సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇది దేశీయ వినియోగానికి మాత్రమే కాకుండా ఎగుమతికి కూడా ఉపయోగించబడుతుందని పేర్కొన్నారు. గడచిన ఏడాది దేశీయ టెలికాం పరికరాల ఎగుమతులు రూ.20,000 కోట్లకు చేరువయ్యాయని చెప్పారు.
5Gలో వేగవంతమైన వృద్ధిని చూస్తున్న భారత్.. 6G టెక్నాలజీ అభివృద్ధికి నాయకత్వం వహించడానికి కృషి చేస్తోందని సింధియా చెప్పారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి భారత్ డిజిటల్ ఫ్రంట్లో అభివృద్ధి చెందుతుండగా, సైబర్ సెక్యూరిటీ ఫ్రంట్లో పెద్ద ముప్పు తలెత్తిందని ఆయన అన్నారు. ఆధునిక యుగంలో యుద్ధాలు భూమిపైనే కాకుండా అనేక ఇతర మార్గాల్లో జరుగుతున్నాయని చెప్పారు. సైబర్ భద్రత విషయానికొస్తే దేశాలు, పౌరులు, వ్యాపారాలను రక్షించడం చాలా ముఖ్యమైనదిగా అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో జియోను బహిష్కరించాలనే ట్రెండ్ తో పాటు తిరిగి వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ కు వెళ్లాలనే పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. దీనిని అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ ఇప్పటికే.. టాటాలకు చెందిన టీసీఎస్ తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాటాలు 4జీ సాంకేతిక అభివృద్ధితో పాటు దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు కసరత్తులు చేస్తున్నారు. టాటాల సహకారంతో BSNL దేశవ్యాప్తంగా 9000 కంటే ఎక్కువ 4G నెట్వర్క్లను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications