BSNL News: యుద్ధం మెుదలెట్టిన బీఎస్ఎన్ఎల్.. అయోమయంలో Jio, Vi, Airtel..

BSNL 4G: ప్రస్తుతం దేశీయ టెలికాం వ్యాపారంలో పెద్ద మార్పులు వస్తున్నాయి. వినియోగదారులు జియో రేట్ల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని తర్వాత మిగిలిన ప్రైవేట్ ఆపరేటర్లు సైతం తమ టారిఫ్ రేట్లను పెంచటంతో పెంపులను వ్యతిరేకిస్తున్న లక్షలాదిమంది బీఎస్ఎన్ఎల్ కు పోర్ట్ అయ్యేందుకు క్యూ కడుతున్నారు.

వాస్తవానికి దేశీయ భడా టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్ టెల్, వొడఫోన్ ఐడియాలు వరుసగా తమ రీచార్జ్ ప్లాన్ రేట్లను పెంచి మెుబైల్ యూజర్లపై భారీ భారాన్ని మోపాయి. ఇది అనూహ్యంగా BSNLకి కలిసొస్తోంది. దేశంలోని అనేక చోట్ల ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. BSNL 4G టెక్నాలజీని గర్వంగా చూడాలని కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. అయితే కంపెనీ 4జీ సర్వీసును ఎప్పుడు ప్రారంభించనుందన్న విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే సాధ్యమైనంత త్వరలో 4జీ, 5జీ సేవలను ప్రారంభిస్తాయని హామీ ఇచ్చారు.

BSNL building 4G infra quickly with TCS help amid Users Migration revoking tariff hikes

దేశంలోని కోట్లాది మంది వినియోగదారులకు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టాటాలు ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ కు సహకరిస్తున్నారు. ఈ క్రమంలో తేజస్, బీఎస్ఎన్ఎల్, టీసీఎస్, సీడీఓటీ కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయని సింధియా పేర్కొన్నారు. భారత్‌లో సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇది దేశీయ వినియోగానికి మాత్రమే కాకుండా ఎగుమతికి కూడా ఉపయోగించబడుతుందని పేర్కొన్నారు. గడచిన ఏడాది దేశీయ టెలికాం పరికరాల ఎగుమతులు రూ.20,000 కోట్లకు చేరువయ్యాయని చెప్పారు.

5Gలో వేగవంతమైన వృద్ధిని చూస్తున్న భారత్.. 6G టెక్నాలజీ అభివృద్ధికి నాయకత్వం వహించడానికి కృషి చేస్తోందని సింధియా చెప్పారు. సైబర్ సెక్యూరిటీకి సంబంధించి భారత్ డిజిటల్ ఫ్రంట్‌లో అభివృద్ధి చెందుతుండగా, సైబర్ సెక్యూరిటీ ఫ్రంట్‌లో పెద్ద ముప్పు తలెత్తిందని ఆయన అన్నారు. ఆధునిక యుగంలో యుద్ధాలు భూమిపైనే కాకుండా అనేక ఇతర మార్గాల్లో జరుగుతున్నాయని చెప్పారు. సైబర్ భద్రత విషయానికొస్తే దేశాలు, పౌరులు, వ్యాపారాలను రక్షించడం చాలా ముఖ్యమైనదిగా అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో జియోను బహిష్కరించాలనే ట్రెండ్ తో పాటు తిరిగి వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ కు వెళ్లాలనే పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. దీనిని అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ ఇప్పటికే.. టాటాలకు చెందిన టీసీఎస్ తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాటాలు 4జీ సాంకేతిక అభివృద్ధితో పాటు దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు కసరత్తులు చేస్తున్నారు. టాటాల సహకారంతో BSNL దేశవ్యాప్తంగా 9000 కంటే ఎక్కువ 4G నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+