రంజాన్ సందర్భంగా నేడు మార్కెట్లు క్లోజ్, రూపాయి బలహీనం..
రంజాన్ సందర్భంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా(NSE), బీఎస్ఈ నేడు(గురువారం, మే 13) వర్క్ చేయడం లేదు. మెటల్, బులియన్ సహా హోల్సేల్ కమోడిటీ మార్కెట్లు ఈ రోజు బంద్ ఉన్నాయి. పారెక్స్, కమోడిటీ ఫ్యూచర్ మార్కెట్స్ కూడా నేడు వర్క్ చేయవు. రంజాన్ సందర్భంగా దేశవ్యాప్తంగా నేడు సెలవు దినం.
కాగా, సెన్సెక్స్ నిన్న ఉదయం 49,171.28 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,171.28 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,550.72 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 471.01 (0.96%) పాయింట్లు నష్టపోయి 48,690.80 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 154.25 (1.04%) పాయింట్లు క్షీణించి 14,696.50 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 14,823.55 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,824.05 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,649.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
మే 12వ తేదీన అమెరికా డాలర్ మారకంతో భారత రూపాయి వ్యాల్యూ 8 పైసలు క్షీణించి రూ.73.42 వద్ద ట్రేడ్ అయింది. సాంకేతికంగా 73 మద్దతు ధర అని, ఈ ధర రూ.72.75 నుండి రూ.72.50 మధ్య కదలాడవచ్చునని, ఒకవేళ పెరిగితే రూ.73.75 నుండి రూ.74 మధ్య ఉండవచ్చునని మార్కెట్ నిపుణుల అంచనా.