Paytm News: ప్రస్తుతం మార్కెట్లో పేటీఎం కంపెనీ షేర్లపై ఇన్వెస్టర్లు ఎక్కువగ దృష్టి సారిస్తున్నారు. వాస్తవానికి సీఈవో శర్మకు సెబీ నోటీసుల తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి శుభవార్త వచ్చింది.
ఫిన్టెక్ తన చెల్లింపు సేవా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి ఆమోదం పొందింది. ఇప్పుడు కంపెనీ తన లైసెన్స్ను తిరిగి పొందడానికి మళ్లీ దరఖాస్తు చేయాలని యోచిస్తోంది. ఈ కాలంలో కంపెనీ తన ప్రస్తుత భాగస్వాములకు సేవలను అందించడం కొనసాగిస్తుంది. ఈ పరిణామాలు కంపెనీ తిరిగి పుంజుకుంటుందనే ఆశావాదాన్ని ఇన్వెస్టర్లలో కలిగిస్తోంది. ఈ క్రమంలో రానున్న కాలంలో పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లు 3 రెట్లు పెరిగి రూ.1,444కి చేరుకోవచ్చని బ్రోకరేజ్ సంస్థ వెంచురా సెక్యూరిటీస్ తన రీసెర్చ్ నోట్ లో వెల్లడించింది.

ఇక రాబడి గురించి బ్రోకరేజ్ వెల్లడిస్తూ రాబోయే 24 నెలల్లో స్టాక్ రెండింతలు రూ.1,170కి చేరుకోవచ్చని పేర్కొంది. ఈ క్రమంలో ఒక్కో పేటీఎం షేర్ ధరకు రూ.1,444 టార్గెట్ ధరగా నిర్ణయించింది. ఈ క్రమంలో నేడు స్టాక్ ధర రూ.559 రేటు వద్ద ప్రారంభమైనప్పటికీ.. 10.18 గంటల సమయంలో రూ.542.35 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. బ్రోకరేజ్ ప్రకారం బేర్ కేసు అంచనాలతో కూడా, వెంచురా రూ.870 స్థాయికి చేరుకుంటుందని పేర్కొంది.
వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలో వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించింది. ఇది కంపెనీకి వ్యాపారంతో పాటు ఆదాయాల పరంగా పెద్ద దెబ్బతీసింది. ఆ సమయంలో మర్చంట్ అకౌంట్ హోల్డర్లు సైతం కంపెనీని భారీగా వీడిన సంగతి తెలిసిందే. వెంచురా అంచనాల ప్రకారం FY24-27లో పేటీఎం ఆదాయం 14.1 శాతం CAGR వద్ద రూ.14,531 కోట్లకు పెరుగుతుందని, సర్వీసెస్ లాభం 15.6 శాతం పెరిగి రూ.8,301 కోట్లకు చేరుతుందని, ప్రీ-ఈఎస్ఓపీ EBITDA 54.5 శాతం పెరిగి రూ.1,829 కోట్లకు చేరుతుందని పేర్కొంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications