Budget 2024: బడ్జెట్ వేళ లాభాలిచ్చే 8 బుల్లెట్ స్టాక్స్ ఇవే.. మీ దగ్గర ఉన్నాయా..?

Budget Stock: NDA కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చాక మూడోసారి ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవటానికి విధాన కొనసాగింపులు ఉంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రీ-బడ్జెట్ విశ్లేషణలో కొన్ని లార్జ్ క్యాప్ కంపెనీలు ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెడతాయని బ్రోకరేజ్ హౌస్ మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేస్తోంది.

ఐసీఐసీఐ బ్యాంక్: మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ టార్గెట్ ధరను రూ.1,350 వద్ద ఉంచింది. ప్రస్తుత మార్కెట్ ధర రూ.1260 కంటే ఇది దాదాపు 8.5 శాతం అధికం. మార్జిన్‌లు సమీప కాలంలో శ్రేణి-బౌండ్‌గా ఉంటాయని బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. అయితే నిర్వహణ లాభం ఆదాయ వృద్ధికి మద్దతుగా ఉంటుందని పేర్కొంది.

Brokerage Motilal oswal picks 8 largecap stocks for budget 2024 amid nearing

హెచ్‌సిఎల్ టెక్: టాప్ ఐటీ సేవల కంపెనీల్లో ఒకటైన హెచ్‌సిఎల్ షేర్లకు రూ.1,710 టార్గెట్ ధరను బ్రోకరేజ్ అందిస్తూ BUY రేటింగ్ అందించింది. ER&D రంగంలో దాని బలమైన సామర్థ్యాలు, బలమైన అవుట్‌సోర్సింగ్ అవకాశాలు, డిజిటల్ ఇంజినీరింగ్ ఆదాయాలను పెంపొందించడానికి నిరంతర పెట్టుబడులు భవిష్యత్తులో స్థిరమైన, ఊహాజనిత వృద్ధిని అందించగలవని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది.

కోల్ ఇండియా: బ్రోకరేజ్ ప్రభుత్వ యాజమాన్యంలోని కోల్ ఇండియా షేర్లకు రూ.550 టార్గెట్ ధరను ఉంచింది. ప్రస్తుతం కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో ఒక్కోటి రూ.512 వద్ద ట్రేడవుతున్నాయి. మెటల్ అండ్ మైనింగ్ రంగంలో కోల్ ఇండియా మోతీలాల్ ఓస్వాల్ టాప్ పిక్‌గా నిలిచింది. బలమైన వాల్యూమ్ ఔట్‌లుక్, ఈ-ఆక్షన్ ప్రీమియం, తక్కువ ఖర్చులతో దీని ఔట్‌లుక్ సానుకూంగా ఉన్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: మోతీలాల్ ఓస్వాల్ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ షేర్లకు టార్గెట్ ధరను రూ.1,015గా నిర్ణయించింది. ఇది ప్రస్తుతం స్టాక్ ట్రేడింగ్ ధర రూ.880 కంటే దాదాపు 19.5 శాతం అధికంగా ఉంది. అద్భుతమైన CD నిష్పత్తి, బలమైన సాంకేతిక సామర్థ్యాలు SBI వృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి దోహదంగా ఉన్నాయని బ్రోకరేజ్ తెలిపింది.

L&T: దేశీయ బ్రోకరేజ్ సంస్థ కంపెనీ షేర్లకు రూ.4,150 టార్గెట్ ధరగా నిర్థేశించింది. ఇది ప్రస్తుత ట్రేడింగ్ ధర రూ.3627 కంటే 14 శాతం అధికం కావటం గమనార్హం. ఎన్నికల తర్వాత దేశీయ ప్రవాహాలలో పికప్, రాబోయే కొద్ది త్రైమాసికాలలో తక్కువ మార్జిన్ లెగసీ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం, వర్కింగ్ క్యాపిటల్‌లో కొనసాగింపు తగ్గింపుతో పాటు ఇతర అంశాలు మెరుగుదలకు దోహదపడయాతని బ్రోకరేజ్ పేర్కొంది.

మహీంద్రా & మహీంద్రా: బ్రోకరేజ్ మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లకు కొత్త టార్గెట్ ధరను రూ.3,300గా నిర్దేశించింది. ఇది దాదాపు 21% పెరుగుదలను సూచిస్తుంది. రాబడులపై స్పష్టమైన దృష్టితో వివేకవంతమైన మూలధన కేటాయింపును కొనసాగించడం స్టాక్ రీ-రేటింగ్‌కు దారితీస్తుందని బ్రోకరేజ్ తెలిపింది.

మ్యాన్‌కైండ్ ఫార్మా: ఫార్మా కంపెనీ షేర్లకు బ్రోకరేజ్ సంస్థ రూ.2,650 లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇది 23% కంటే ఎక్కువ పెరుగుదలను సూచిస్తుంది. దాని బలమైన బ్రాండ్ ఔట్‌లుక్ స్థిరమైన ఆదాయాల వృద్ధి, మెరుగైన రాబడి నిష్పత్తుల దృష్ట్యా మోతీలాల్ ఓస్వాల్ FY24-27లో 16% ఆదాయాలు CAGRని ఆశించారు.

చోళ ఇన్వెస్ట్మెంట్స్: బ్రోకరేజ్ ప్రకారం కంపెనీ షేర్లు రానున్న కాలంలో రూ.1,660 లక్ష్యాన్ని చేరుకుంటాయని తెలుస్తోంది. వాస్తవంగా ప్రస్తుత ధర కంటే ఈ లక్ష్యం ధర 17 శాతం అధికంగా ఉంది. చోళా ప్రస్తుతం తమ ప్లాట్‌ఫారమ్‌లలో మంచి స్థాయిని కలిగి ఉన్న ఎనిమిది ఫిన్‌టెక్ భాగస్వాములతో సహకరిస్తున్నట్లు బ్రోకరేజ్ తెలిపింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+