Broking Scam: ఇటీవలి కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రధానంగా చిన్న రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా మార్కెట్లోకి డబ్బు కుమ్మరిస్తున్నారు. ఈక్వీటీలు, డెరివేటివ్స్ వంటి రిస్కీ సాధనాల్లో తమ డబ్బును పెట్టడం ద్వారా వేగంగా రాబడులను పొందాలని ప్రయత్నిస్తున్నారు.
అయితే వీటికి కావలసింది ముందుగా ఒక బ్రోకరేజ్ సంస్థ నుంచి ట్రేడింగ్ అకౌంట్ తీసుకోవటం. చాలా మంది తమ ట్రేడింగ్ అవసరాల కోసం తక్కువ ఖర్చులో సేవలను అందించే డిస్కౌంట్ బ్రోకరేజీలను ఎంచుకుంటుంటారు. ఈ కేటగిరీలో అతిపెద్ద ఆటగాడు జెరోధా. అయితే తాజాగా కంపెనీలో జరిగిన పెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో సీఐడీ క్రైమ్ బ్రాంచ్ 15 మంది వ్యక్తులపై కేసు నమోదు చేయడంతో సూరత్లో ముఖ్యమైన స్టాక్ బ్రోకింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది.

బ్రోకరేజ్ ప్లాట్ఫారమ్లోని ఉద్యోగి నకిలీ డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలను సృష్టించినట్లు గుర్తించబడింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కిషన్ సోనీని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి సోనీ, జెరోధాతో మాజీ వ్యక్తిగత క్లయింట్ అసోసియేట్. ఇతను దాదాపు రెండేళ్ల కాలంలో 432 ఖాతాలను తెరిచాడు. ఈ ఖాతాలను తెరవడంలో వ్యక్తులకు సహాయం చేసినందుకు అతను మొదట్లో కమీషన్లు సంపాదించగా, చాలా మోసపూరిత ఖాతాలు ఉన్నారని కంపెనీ తరువాత గుర్తించటంతో వ్యవహారం పోలీసుల దాకా వెల్లింది.
స్కామ్లో ఖాతాలను తెరవడానికి నకిలీ పత్రాలను ఉపయోగించడం, సదరు ఖాతాలను నిర్వహించడానికి, వ్యాపార కార్యకలాపాలలో పాల్గొనడానికి బీహార్కు చెందిన 14 మంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయినట్లు దర్యాప్తులో గుర్తించబడింది. అధిక బ్రోకరేజ్ రుసుములను రూపొందించడానికి చిన్న వ్యాపారాలు బహుళ ఖాతాలలో విస్తరించిన "మంచుకొండ వర్తకాలు" ద్వారా సోనీ అతని సహచరులు గణనీయమైన మొత్తంలో డబ్బును జేబులో వేసుకున్నారు. ఈ కుంభకోణంలో రూ.2.20 కోట్లు గోల్ మాల్ జరిగిందని తేలింది. ఈ మెుత్తానికి చెల్లించాల్సిన పన్ను, జీఎస్టీ ఎగవేతతో కలిపి రూ.2.75 కోట్ల మోసం జరిగిందని సీఐడీ అధికారులు గుర్తించారు.
వాస్తవానికి పెద్ద సంఖ్యలో ఖాతాల్లో డెబిట్ బ్యాలెన్స్లు ఉన్నాయని ఆడిట్లో గుర్తించిన జెరోధా బ్రోకరేజ్ వాటికి సంబంధించి సదరు ఖాతాదారులను సంప్రదించింది. ఈ క్రమంలో చాలా మంది తాము ఎలాంటి ఖాతాను జెరోధా వద్ద తెరవలేదని వెల్లడించటంతో స్కామ్ బయటకు వచ్చింది. ఈ కుంభకోణంలో పాల్గొన్న ఖాతాలు ఒక్కొక్కటి రూ.70,000 నుంచి రూ.72,000 వరకు నష్టపోయాయి. ప్రస్తుతం సీఐడీ క్రైం బ్రాంచ్ ఈ కేసును విచారించి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది. దీని ప్రకారం వ్యక్తులు తమ కేవైసీ వివరాలను ఇతరులకు షేర్ చేయటం దుర్వినియోగానికి దారితీసే ప్రమాదాలను ఎత్తి చూపుతోంది. ఇలాంటి స్కామర్లకు కమిషన్ల కోసం వివరాలు అందించటం భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications