Broking Scam: ఇటీవలి కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రధానంగా చిన్న రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా మార్కెట్లోకి డబ్బు కుమ్మరిస్తున్నారు. ఈక్వీటీలు, డెరివేటివ్స్ వంటి రిస్కీ సాధనాల్లో తమ డబ్బును పెట్టడం ద్వారా వేగంగా రాబడులను పొందాలని ప్రయత్నిస్తున్నారు.
అయితే వీటికి కావలసింది ముందుగా ఒక బ్రోకరేజ్ సంస్థ నుంచి ట్రేడింగ్ అకౌంట్ తీసుకోవటం. చాలా మంది తమ ట్రేడింగ్ అవసరాల కోసం తక్కువ ఖర్చులో సేవలను అందించే డిస్కౌంట్ బ్రోకరేజీలను ఎంచుకుంటుంటారు. ఈ కేటగిరీలో అతిపెద్ద ఆటగాడు జెరోధా. అయితే తాజాగా కంపెనీలో జరిగిన పెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో సీఐడీ క్రైమ్ బ్రాంచ్ 15 మంది వ్యక్తులపై కేసు నమోదు చేయడంతో సూరత్లో ముఖ్యమైన స్టాక్ బ్రోకింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది.

బ్రోకరేజ్ ప్లాట్ఫారమ్లోని ఉద్యోగి నకిలీ డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలను సృష్టించినట్లు గుర్తించబడింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కిషన్ సోనీని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి సోనీ, జెరోధాతో మాజీ వ్యక్తిగత క్లయింట్ అసోసియేట్. ఇతను దాదాపు రెండేళ్ల కాలంలో 432 ఖాతాలను తెరిచాడు. ఈ ఖాతాలను తెరవడంలో వ్యక్తులకు సహాయం చేసినందుకు అతను మొదట్లో కమీషన్లు సంపాదించగా, చాలా మోసపూరిత ఖాతాలు ఉన్నారని కంపెనీ తరువాత గుర్తించటంతో వ్యవహారం పోలీసుల దాకా వెల్లింది.
స్కామ్లో ఖాతాలను తెరవడానికి నకిలీ పత్రాలను ఉపయోగించడం, సదరు ఖాతాలను నిర్వహించడానికి, వ్యాపార కార్యకలాపాలలో పాల్గొనడానికి బీహార్కు చెందిన 14 మంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయినట్లు దర్యాప్తులో గుర్తించబడింది. అధిక బ్రోకరేజ్ రుసుములను రూపొందించడానికి చిన్న వ్యాపారాలు బహుళ ఖాతాలలో విస్తరించిన "మంచుకొండ వర్తకాలు" ద్వారా సోనీ అతని సహచరులు గణనీయమైన మొత్తంలో డబ్బును జేబులో వేసుకున్నారు. ఈ కుంభకోణంలో రూ.2.20 కోట్లు గోల్ మాల్ జరిగిందని తేలింది. ఈ మెుత్తానికి చెల్లించాల్సిన పన్ను, జీఎస్టీ ఎగవేతతో కలిపి రూ.2.75 కోట్ల మోసం జరిగిందని సీఐడీ అధికారులు గుర్తించారు.
వాస్తవానికి పెద్ద సంఖ్యలో ఖాతాల్లో డెబిట్ బ్యాలెన్స్లు ఉన్నాయని ఆడిట్లో గుర్తించిన జెరోధా బ్రోకరేజ్ వాటికి సంబంధించి సదరు ఖాతాదారులను సంప్రదించింది. ఈ క్రమంలో చాలా మంది తాము ఎలాంటి ఖాతాను జెరోధా వద్ద తెరవలేదని వెల్లడించటంతో స్కామ్ బయటకు వచ్చింది. ఈ కుంభకోణంలో పాల్గొన్న ఖాతాలు ఒక్కొక్కటి రూ.70,000 నుంచి రూ.72,000 వరకు నష్టపోయాయి. ప్రస్తుతం సీఐడీ క్రైం బ్రాంచ్ ఈ కేసును విచారించి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది. దీని ప్రకారం వ్యక్తులు తమ కేవైసీ వివరాలను ఇతరులకు షేర్ చేయటం దుర్వినియోగానికి దారితీసే ప్రమాదాలను ఎత్తి చూపుతోంది. ఇలాంటి స్కామర్లకు కమిషన్ల కోసం వివరాలు అందించటం భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications