Mutual Funds: దేశంలో అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు చేరువైంది జెరోధా బ్రోకరేజ్. తక్కువ ధరలకు సేవలను అందుబాటులోకి తీసుకురావటంతో చాలా ప్రాచుర్యాన్ని పొందింది. తాజాగా ఈ సంస్థ మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే.
భారతదేశపు సరికొత్త ఫండ్ హౌస్లలో ఒకటైన Zerodha Fund House, సోమవారం తన మొదటి రెండు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ప్రారంభించేందుకు సెబీ వద్ద డ్రాఫ్ట్ డాక్యుమెంట్లను దాఖలు చేసింది. గత నెలలో నితిన్ కామత్ నేతృత్వంలోని జెరోధా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ప్రారంభించడానికి SEBI నుంచి తుది ఆమోదం పొందింది. జెరోధా ఫండ్ హౌస్ అనేది బ్రోకరేజ్ సంస్థ జెరోధా, ఫిన్టెక్ ప్లాట్ఫారమ్ స్మాల్కేస్ మధ్య ఒక జాయింట్ వెంచర్. ఈ క్రమంలో కంపెనీ లాంట్ చేస్తున్న రెండు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గురించి గమనిస్తే..

1) జెరోధా నిఫ్టీ లార్జ్మిడ్క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్- "నిఫ్టీ లార్జ్మిడ్క్యాప్ 250 ఇండెక్స్ రిప్లికేటింగ్ లేదా ట్రాకింగ్ ఓపెన్-ఎండ్ స్కీమ్"
2) జెరోధా టాక్స్ సేవర్(ELSS) నిఫ్టీ లార్జ్ మిడ్క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ - ఇది ఫైలింగ్ ఓపెన్ అవుతుంది. 3 ఏళ్ల చట్టబద్ధమైన లాక్-ఇన్ వ్యవధితో పాసివ్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్. ఇది నిఫ్టీ లార్జ్ మిడ్క్యాప్ 250 ఇండెక్స్ను రెప్లికేట్ చేయడం లేదా ట్రాక్ చేయడం ద్వారా పన్ను ప్రయోజనాన్ని అందిస్తుంది.

ELSS పథకం అనేది పన్ను ఆదా చేసే పథకం. ఇది సెక్షన్ 80C పన్ను మినహాయింపు ప్రయోజనాలను రూ.1.5 లక్షల వరకు పెట్టుబడిగా ఇస్తుంది. గత నెలలో విశాల్ జైన్ను జెరోధా ఫండ్ హౌస్ సీఈవోగా ప్రకటించారు. జెరోధా పాసివ్ ఫండ్స్ ద్వారా ఫండ్ మేనేజ్మెంట్ ఖర్చులు తగ్గిస్తూ.. తక్కువ ధరల వద్ద ఉత్పత్తులను ప్రారంభించేందుకు వీలు కల్పిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market: ఇన్వెస్టర్ల కొంప ముంచిన మార్కెట్! ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలివే!

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications