Akshata Murthyకి ఇన్ఫోసిస్ కష్టాలు.. ఒక్క రోజే ఊహించని నష్టం.. ఏం జరిగింది..?

Akshata Murthy: బ్రిటన్ ప్రధాని రిషి సునక్, అతని భార్య అక్షత మూర్తికి దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కష్టాలు పెరిగాయి. ఒక పక్క న్యాయపరమైన చిక్కులు ఇబ్బంది పెడుతుంటే.. ఇప్పుడు నష్టాలు వెంటాడుతున్నాయి.

బ్రిటన్ ప్రధాని సునక్ భార్యకు భారత టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ లో వాటాలు ఉన్నాయి. అయితే వీటి ద్వారా మెున్న డివిడెండ్ ఆదాయం భారీగా పొందిన అక్షతకు ఆ ఆనందం కొన్ని రోజులు కూడా నిలవలేదు. ఎందుకంటే నిన్న ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్చి 2020 తర్వాత కనిష్ఠాలకు చేరుకోవటంతో దాదాపు రూ.500 కోట్లను అక్షత ఒక్క రోజులో కోల్పోయారు.

Britan PM Rishi sunak Wife Akshata Murthy lost 500 crores with infosys shares fall in single day

భారత ఐటీ సేవల రంగానికి సంబంధించి రానున్నది గడ్డుకాలంగా కంపెనీల ఫలితాలు చెబుతున్న వేళ అమ్మకాల ఒత్తిడిలో ఐటీ షేర్లు ఉన్నాయి. ఇదే క్రమంలో బ్రోకరేజ్ కంపెనీలు సైతం ఐటీ షేర్ల టార్గెట్ ధరలను తగ్గించాయి. నిన్న ఒక్కరోజే ఇన్ఫోసిస్ షేర్లు 9.4 శాతానికి పైగా నష్టపోయింది. దీనికి ముందు గతవారం బ్రిటన్ ప్రధానిగా ఉన్న సునక్ సొంత ఆర్థిక వ్యవహారాల వల్ల గడచిన మూడేళ్లలో 1 మిలియన్ పౌండ్లకు పైగా పన్నులు చెల్లించినట్లు వెల్లడించారు.

అక్షత మూర్తి సంపద, బయటి ఆసక్తులు ఆమె భర్త రాజకీయ జీవితంలో పునరావృతమయ్యే అంశంగా ఉంది. గత సంవత్సరం ఆమె నివాసేతర హోదాను కలిగి ఉందని, విదేశీ ఆదాయాలపై UKలో పన్ను చెల్లించలేదని తేలింది. ఇన్ఫోసిస్ నుంచి భారీగా ఆదాయాన్ని పొందుతున్న అక్షత.. తన ఏర్పాట్లు "పూర్తిగా చట్టబద్ధమైనవి" అని స్పష్టం చేసింది. అయితే ఆ ఆదాయాలపై బ్రిటిష్ పన్నులు చెల్లించడం ప్రారంభించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+