భారతదేశంలో రైలు ప్రయాణం అనేది కోట్లాది ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా మారింది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా లక్షలాది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. అయితే ఈ ప్రయాణంలో చాలామంది గుర్తించని ఒక ముఖ్యమైన అంశం ఉంది. అది లగేజీ (సామాను) బరువు పరిమితి. చాలామంది తమకు కావలసినంత సామాను తీసుకెళ్లవచ్చని అనుకుంటారు. కానీ, భారత రైల్వే దీనికి స్పష్టమైన నియమాలు విధించింది. ఈ నియమాలను పాటించకపోతే మీరు జరిమానా కూడా చెల్లించాల్సి రావచ్చు.
మీరు రైల్వేలో రెండవ తరగతి (Second Class) టికెట్ బుక్ చేసుకుని ప్రయాణిస్తున్నట్లయితే.. మీ లగేజీ బరువు 35 కిలోల కంటే ఎక్కువ కాకూడదు. అంటే మీరు 35 కిలోల వరకు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా తీసుకెళ్లవచ్చు.కానీ, మీరు తీసుకెళ్తున్న లగేజీ 35 కిలోల కంటే ఎక్కువగా.. 70 కిలోల వరకు ఉంటే, అప్పుడు మీరు అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీని రైల్వే స్టేషన్లోని లగేజీ బుకింగ్ కౌంటర్ వద్ద ముందుగానే చెల్లించాలి.

మీ లగేజీ బరువు 70 కిలోల కంటే ఎక్కువైతే, మీరు దానిని మీతోపాటు తీసుకెళ్లకూడదు. అప్పుడు రైల్వే రిజర్వ్ లగేజీ వ్యాన్ (Luggage Van) ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఈ వ్యాన్లో లగేజీని విడిగా బుక్ చేసుకోవాలి. ఇలా చేయకపోతే TTE లగేజీని తనిఖీ చేసినప్పుడు జరిమానా విధించవచ్చు. సాధారణంగా రైల్వేలో ప్రయాణికుల లగేజీ బరువును ఎవరూ తూకం వేయరు. కానీ కొన్నిసార్లు TTEకి మీ లగేజీ ఎక్కువగా కనిపిస్తే లేదా అనుమానం వస్తే, ఆయన లగేజీని తనిఖీ చేయవచ్చు.మీ లగేజీ బరువు పరిమితిని మించితే, మీరు తగినంత ఫైన్ (జరిమానా) చెల్లించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు..లగేజీ 35 కిలోల కంటే 10 కిలోలు ఎక్కువగా ఉంటే, ఒక చిన్న అదనపు ఛార్జీ చెల్లించవలసి ఉంటుంది. నీ లగేజీ 45 కిలోల కంటే ఎక్కువగా ఉంటే, జరిమానా మొత్తం లగేజీ ఛార్జీకి 6 రెట్లు వరకూ ఉండవచ్చు. అంటే మీరు లగేజీ బుకింగ్ కోసం రూ.100 చెల్లించాల్సిన స్థితిలో ఉన్నా, దాన్ని బుక్ చేయకపోతే, పట్టుబడితే, రూ.600 వరకు జరిమానా చెల్లించాల్సి రావచ్చు.
రైల్వేలు ప్రతి బోగీలో ప్రయాణికుల భద్రతను, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ లగేజీ పరిమితిని నిర్ణయించాయి. చాలా సామాను తీసుకెళ్లడం వల్ల ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుంది. సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతాయి.
ప్రయాణానికి ముందు జాగ్రత్తలు
రైలు ఎక్కే ముందు మీ బ్యాగ్ల బరువును ఒకసారి తూకం వేయండి.
లగేజీ ఎక్కువగా ఉంటే ముందుగానే లగేజీ బుక్ చేసుకోండి.
ప్రయాణ సమయంలో రైల్వే టికెట్తో పాటు లగేజీ రసీదును కూడా తీసుకెళ్లండి.
అనుమానం ఉన్నప్పుడు రైల్వే సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకోండి.
మీరు చేసే చిన్న తప్పిదం వల్ల పెద్ద ఇబ్బంది ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి రైలు ప్రయాణానికి బయలుదేరే ముందు లగేజీ బరువును ఖచ్చితంగా తనిఖీ చేయండి. రైల్వే నియమాలను పాటించడం ద్వారా మీరు జరిమానా తప్పించుకోవడమే కాకుండా, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

పెరుగుతున్న బంగారం ధరలు.. అదే స్థాయిలో పెరుగుతున్న పసిడి రుణాలు.. ఎందుకు తాకట్టు పెడుతున్నారు..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..



Click it and Unblock the Notifications