Bondada Engineering IPO: కరోనా తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల కోలాహలం కొనసాగుతూనే ఉంది. వీటిలో పాల్గొంటున్న వారితో పాటు తర్వాత దీర్ఘకాలం కోసం పెట్టుబడులను కొనసాగిస్తున్న ఇన్వెస్టర్లు సైతం భారీ లాభాలను అందుకుంటున్నారు. దీంతో చాలా మంది ఈక్విటీలను వదిలేసి ఐపీవోల వెంట పడుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నేడు ట్రేడింగ్లో బొండాడ ఇంజినీరింగ్ షేర్ల గురించే. ఈరోజు కంపెనీ షేర్లు 5% ఎగువ సర్క్యూట్ను తాకి 52 వారాల గరిష్ట స్థాయి రూ.2558.60కి చేరాయి. వాస్తవానికి కంపెనీ షేర్ల పెరుగుదల వెనుక పెద్ద ఆర్డర్ పొందటం కారణంగా ఉంది. నిజానికి బొండాడ ఇంజనీరింగ్కు భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ నుంచి పెద్ద ఆర్డర్ వచ్చింది. ఈ సమాచారాన్ని కంపెనీ స్టాక్ మార్కెట్కు అందించింది.

భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ నుంచి తమకు వర్క్ ఆర్డర్ అందిందని కంపెనీ ఎక్స్ఛేంజీ ఫైలింగ్స్ ద్వారా తెలిపింది. ఇందులో బొండాడ ఇంజినీరింగ్ బేస్ లేకుండా 60 కిలోల బరువున్న 6 మీటర్ల ఎత్తు గల జీఐ పోల్ను సరఫరా చేయాల్సి ఉంది. ఈ ఆర్డర్ విలువ దాదాపు రూ.2 కోట్లుగా వెల్లడైంది. ఈ వార్త బయటకు రావటంతో నేడు బీఎస్ఈలో కంపెనీ షేర్లలో కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది. దీనికి ముందు శుక్రవారం రోజున రూ.2436.80 రేటు వద్ద ట్రేడింగ్ ముగించిన స్టాక్ ఉదయం 4.8 శాతం పెరిగి రూ.2554.40 రేటు వద్ద ప్రారంభమైంది. ఈరోజు బొండాడ ఇంజినీరింగ్ షేర్లు ఇంట్రాడేలో 5% పెరిగి రూ.2,558.60 వద్ద ఆల్-టైమ్ హైని తాకాయి.
బొండాడ ఇంజనీరింగ్ IPO గత సంవత్సరం ఆగస్టులో రూ.75 ధరతో వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నేటి షేర్ ధర ప్రకారం 3311 శాతం పెరిగింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.5,527.10 కోట్లుగా ఉంది. బొండాడ ఇంజనీరింగ్ ఇటీవలే దాని FY24 ఆర్థిక పనితీరును నివేదించింది. FY23లో రూ.44.72 కోట్ల మల్టీఫుడ్ నికర లాభం రూ.16.8 కోట్ల నుంచి పెరిగింది. ఇదే క్రమంలో కంపెనీ నిర్వహణ ఆదాయం FY24లో రూ.800.72 కోట్లుగా నిలిచింది.


Click it and Unblock the Notifications