boAt IPO: గడచిన కొన్ని నెలలుగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదొడుకులతో పతనాన్ని చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఐపీవోల రాక స్టాక్ మార్కెట్లలో దాదాపుగా నిలిచిపోయింది.
అయితే ప్రముఖ ఆడియో బ్రాండ్ బోట్ తన నూతన ఆర్థిక అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తోంది. సంస్థ త్వరలోనే సుమారు రూ.2,000 కోట్లు నిధులు సంపాదించేందుకు ఐపీవోను మార్కెట్లో ఫ్లోట్ చేయాలని చూస్తోంది. దీని ద్వారా సంస్థ తన వ్యాపార విస్తరణ, ఉత్పత్తి అభివృద్ధి, నూతన మార్కెట్లలో పెరుగుదల ప్రాధాన్యతను పొందగలుగుతుంది. మార్కెట్లో తన భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీవో సొమ్ము సంస్థకు వృద్ధి, వ్యాపార విస్తరణ, కొత్త ఉత్పత్తుల తయారీ, R&Dతో పాటు దేశీయ-అంతర్జాతీయ మార్కెట్లలో తమ ఉత్పత్తులను మరింత ప్రోత్సహించేందుకు ఉపయోగపడతాయి.

కంపెనీ ప్రస్థానం-వ్యాపారం..
బోట్ 2016లో ప్రధానంగా యువతను టార్గెట్ చేస్తూ మొదలైన భారతీయ ఆడియో బ్రాండ్. ఈ సంస్థ తన వాయిస్ ఉత్పత్తులతో విపరీతమైన ఆదరణ పొందింది. boAt పరికరాలు ప్రధానంగా బ్లూటూత్ హెడ్ఫోన్లు, ఇయర్ఫోన్లు, పోర్టబుల్ స్పీకర్లు, పవర్ బ్యాంకులు వంటి ప్రముఖ ఆడియో ఉత్పత్తుల పోర్ట్ ఫోలియోను కలిగి ఉంది. తక్కువ ధరలో అధిక నాణ్యతను అందించడం ద్వారా దేశంలో పెద్ద స్థాయి వినియోగదారులను ఆకర్షించింది. స్వదేశీ బ్రాండ్గా పుట్టినప్పటికీ ప్రస్తుతం.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. యువత, సంగీత ప్రేమికుల మధ్య బోట్ బ్రాండ్ ఒక గుర్తింపును పొందింది.
బోట్ ఐపీవోతో బహుళ మార్కెట్ పెట్టుబడులను ఆకర్షించగలదు. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇప్పటికే ఎంతో మంది పెద్ద సంస్థలు ప్రాముఖ్యమైన స్థానాన్ని సంపాదించాయి. బోట్ కూడా ఈ ఐపీవోతో ఇప్పుడు ఒక ప్రధాన చర్చనీయాంశంగా మారింది. సంస్థ ఈ ఐపీవోను 2025లో ప్రారంభించవచ్చని తెలుస్తోంది. ఈ ఐపీవో ద్వారా వచ్చిన నిధులు అనేక వ్యాపార విస్తరణ ప్రణాళికలకు ఉపయోగపడతాయని తెలుస్తోంది.
మొట్టమొదటి దశలోనే తన వినియోగదారులకు అనేక ట్రెండ్స్టింగ్ ఉత్పత్తులను అందించింది. తక్కువ ధరలో ఉన్న ఉత్పత్తులు, అధిక నాణ్యతతో కూడుకున్న వినియోగదారుల అవసరాలను తీర్చింది. ఈక్రమంలోనే బ్రాండ్ తన వినియోగదారులకు హై-ఫై ఆడియో ఉత్పత్తులను, సమర్థవంతమైన ధరల్లో అందిస్తూ చరిత్ర సృష్టించింది. 2023-24లో బోట్ 60% నికర లాభాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో కంపెనీ ఆదాయం కూడా పెరిగింది. ఈ కంపెనీ అనేక ఇంటర్నేషనల్ మార్కెట్లలో తన ఉత్పత్తులను పంపిణీ చేయడం ద్వారా దాని ఆదాయాన్ని మరింత పెంచుకుంటోంది. దే క్రమంలో కంపెనీ తన బ్రాండ్ విలవను పెంచుకోవటంపై ప్రధానంగా దృష్టి సారించి ముందుకు సాగుతోంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications