ఢిల్లీ-ఎన్సిఆర్, బెంగళూరు సహా ముంబైలో గురువారం ఎలక్ట్రిక్ క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్ బ్లూస్మార్ట్ మూతపడింది. దింతో యాప్ పనిచేయక పోవడంతో పాటు బుకింగ్లు ఆగిపోయాయి. దింతో వేలాది మంది డ్రైవర్లు, లక్షలాది మంది కస్టమర్లని ఆసౌకర్యానికి గురిచేసింది. ఇటీవల సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) బ్లూస్మార్ట్ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గి అండ్ పునీత్ సింగ్ జగ్గిలపై మనీలాండరింగ్ అభియోగాలు మోపింది. బ్లూస్మార్ట్ పై మరో కంపెనీ జెన్సోల్ ద్వారా నిధులు సేకరించి విలాసాలకు ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జెన్సోల్ బ్లూస్మార్ట్ చెందిన అనుబంధ సంస్థ. అయితే ఈ కంపెనీలో చాలా మంది ప్రముఖులు కూడా పెట్టుబడి పెట్టడం గమనార్షం.

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని జూలై 2024లో బ్లూస్మార్ట్లో పెట్టుబడి పెట్టగా, ప్రముఖ బాలీవుడ్ నటి దీపిక కూడా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టింది. వీరితో పాటు బజాజ్ గ్రూప్కు చెందిన బడా వ్యాపారవేత్త సంజీవ్ బజాజ్ కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసారు. చివరికి BharatPe వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ కూడా బ్లూస్మార్ట్లో రూ. 1.5 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ఎక్స్-పోస్ట్లో తెలిపారు.
కస్టమర్ల ఆందోళన : చాలా మంది బ్లూస్మార్ట్ కస్టమర్లు బ్లూస్మార్ట్ వాలెట్ల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ట్రిప్ బుక్ కావడం లేదని అలాగే దినికి తోడు వాలెట్లో ఇరుక్కుపోయిన డబ్బును తీసుకోలేకపోతున్నామని X పోస్ట్ ద్వారా తెలిపారు.
కంపెనీ ఏం చెబుతోందంటే : బ్లూస్మార్ట్ 90 రోజుల్లోపు కస్టమర్ల డబ్బును తిరిగి చెల్లిస్తామని ఒక ఇమెయిల్ ద్వారా హామీ ఇచ్చింది. వీలైనంత త్వరగా సేవలను పునరుద్ధరించడానికి మేము ప్రయత్నిస్తున్నాము, కానీ 90 రోజుల్లోపు సేవలు పునరుద్ధరించబడకపోతే మేము మీ డబ్బును తిరిగి చెల్లిస్తాము, మీ మద్దతుకి మేము నిజంగా అభినందిస్తున్నాము అని ఇమెయిల్ లో పేర్కొంది.
ప్రస్తుతం, బ్లూస్మార్ట్ యాప్ నిబంధనలు & షరతుల ప్రకారం బ్లూస్మార్ట్ వాలెట్లో ఉన్న డబ్బు పూర్తిగా తిరిగి చెల్లించబడదని పేర్కొంటున్నాయి. దీనికి ఎటువంటి కాలపరిమితి లేదు. డబ్బు రిటర్న్ విషయంలో బ్లూస్మార్ట్ యాప్లో చేసిన ఏదైనా లావాదేవీకి తిరిగి బ్లూ వాలెట్కు మాత్రమే తిరిగి చెల్లించబడుతుంది కానీ బ్యాంక్ అకౌంటుకి కాదు. అయితే కస్టమర్లు బ్లూస్మార్ట్ వాలెట్లో డబ్బును తిరిగి పొందడానికి కొన్ని చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఇందుకు కస్టమర్లు బ్లూస్మార్ట్ యాప్ కస్టమర్ సపోర్ట్ టీమ్కి ఫిర్యాదు చేసి, డబ్బు రిటర్న్ కోరవచ్చని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications