LPG Prices: అదానీ ఎదుగుదలకు బీజేపీ ప్రభుత్వం సాయం చేస్తోందనే వాదన మెున్నటి వరకు భారీగా వినిపించింది. అయితే అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ల కోసమే కేంద్రంలోని ప్రభుత్వాలు పనిచేస్తుంటాయనే వాదనలు, వార్తలు తరచుగా బయట వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇలాంటి సమయంలో ఒక బాంబు లాంటి ఆరోపణ వెలుగులోకి వచ్చింది.

కాంగ్రెస్ ప్రభుత్వం..
యూపీఏ ప్రభుత్వంలో గ్యాస్ ధరలను నిర్ణయించేందుకు ఉపయోగించిన ఫార్ములా వల్ల ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లాభపడిందని వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయాన్ని వెల్లడించింది.. మాజీ క్యాబినెట్ సెక్రటరీ కేఎం చంద్రశేఖర్. ఆయన రాసిన As Good As My Word: A Memoir అనే పుస్తకం ఆధారంగా బీజేపీ తాజాగా దీనిపై తన వాదనను వెలుగులోకి తెచ్చింది. ఈ పుస్తకంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల గురించి ఈ పుస్తకంలో రాశారు.
గ్యాస్ ధరలు..
దేశంలో గ్యాస్ ధరలను నిర్ణయించే ప్రక్రియలో చాలా తప్పులు జరిగాయని చంద్రశేఖర్ తన పుస్తకంలో వెల్లడించారు. ముఖేష్ గ్యాస్ ధర కోసం అటువంటి సూత్రాన్ని ముందుకు తెచ్చారన్నారు. ఆ సమయంలో ముడి చమురు రేటును పరిగణలోకి తీసుకుంటే.. గ్యాస్ ధర యూనిట్ కు 4.5 డాలర్ల కంటే ఎక్కువగా ఉంది. అదే సమయంలో అనిల్ అంబానీ పవర్ ప్లాంట్లకు 2.3 MMBTU చొప్పున గ్యాస్ సరఫరా చేయడానికి అంగీకరించిన ఒప్పందం జరిగింది. అయితే ప్రభుత్వ NTPC టెండర్ ఆధారంగా యూనిట్కు 2.3 డాలర్లుగా రేటు నిర్ణయించబడిందని చంద్రశేఖర్ వెల్లడించారు. తర్వాత ఆ వ్యవహారం కోర్టుకు కూడా వెళ్లింది.

ట్వీట్ ద్వారా..
చంద్రశేఖర్ తన పుస్తకంలో రాసిన విషయాలను ఆధారంగా తీసుకుంది బీజేపీ. దీనితో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగింది. ఆ పార్టీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేస్తూ..''రిలయన్స్ లాంటి ప్రైవేట్ సంస్థ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏని నియంత్రించింది'' అంటూ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ అంబానీ 'కాస్ట్ ప్లస్ ఫార్ములా ఉపయోగించాలి, ధర నిర్ణయించడంలో కాగ్ కూడా పాల్గొనాలి. రిలయన్స్ గ్యాస్ను $2.3 రేటుకు విక్రయించడానికి అంగీకరించినప్పుడు.. నాలుగు డాలర్ల కంటే ఎక్కువ ధరలో నాకు ఎలాంటి లాజిక్ అర్థం కాలేదంటూ కామెంట్ చేశారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications