Jack Ma: యాంట్ గ్రూప్పై పట్టుకోల్పోనున్న బిలియనీర్ జాక్ మా..
బిలియనీర్ జాక్ మా ఇకపై చైనీస్ ఫిన్టెక్ దిగ్గజం యాంట్ ను నియంత్రించలేరు. ఆయన తన ఓటింగ్ హక్కులను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు గ్రూప్ శనివారం తెలిపింది. 2020 చివరలో యాంట్ $37 బిలియన్ల IPOని తీసుకురావడానికి ముందు ప్రభుత్వంపై విమర్శలు చేయతడంతో ఐపీఓ ఆగిపోయింది.
"జాక్ మా స్థాపించిన యాంట్ నుంచి జాక్ మా నిష్క్రమణ, పెద్ద ప్రైవేట్ పెట్టుబడిదారుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. చైనా నాయకత్వం దృఢ సంకల్పాన్ని చూపిస్తుంది. ఈ ధోరణి చైనీస్ ఆర్థిక వ్యవస్థ అత్యంత ఉత్పాదక భాగాల కోతను కొనసాగిస్తుంది" అని ఓరియంట్ క్యాపిటల్ రీసెర్చ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆండ్రీ కొల్లియర్ తెలిపారు. యాంట్ ఆర్థిక వ్యవస్థకు తక్కువ ప్రమాదం కలిగించిందన్నారు.
ఆర్థిక వృద్ధికి ప్రధాన డ్రైవర్లలో ఒకటైన చిన్న వ్యాపారాల కోసం రుణాలను ఏర్పాటు చేయడంలో ప్రభావవంతంగా ఉందని చెప్పారు. "అతను ఇకపై నియంత్రణలో ఉన్న వాటాదారు కానట్లయితే IPOకి మార్గం సుగమం చేస్తుంది" అని బీజింగ్లోని ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సంస్థ BDA ఛైర్మన్ డంకన్ క్లార్క్ అన్నారు.