కరోనా మహమ్మారి కారణంగా విమానయానరంగంపై భారీ ప్రభావం పడింది. ఈ వైరస్ కారణంగా ఇండియా బిగ్గెస్ట్ లో-కాస్ట్ ప్రయివేట్ ఎయిర్ లైన్స్ ఇండిగో తన ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీ ఈ ఆర్థిక ప్రభావాన్ని కంపెనీ తట్టుకుంటుందని భావించడం లేదని, వ్యాపార కార్యకలాపాలను కొనసాగించడానికి మరికొంత సమయం పడుతుందని, ఇలాంటి సమయంలో కొంత త్యాగం తప్పదని ఇండిగో సీఈవో రోనోజాయ్ దత్తా సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

కంపెనీ చరిత్రలో తొలిసారి...
కంపెనీ చరిత్రలోనే తొలిసారి 10 శాతం ఉద్యోగులను తొలగించామని సీఈవో ప్రకటించారు. లేఆఫ్ ప్రభావం పడిన ఉద్యోగులకు స్థూల వేతనం ఆధారంగా నోటీస్ పే ఇస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగుల సర్వీసును బట్టి 3 నెలల నుండి 12 నెలల స్థూల వేతనం చెల్లిస్తామన్నారు. మార్చి 31, 2019 నాటికి కంపెనీలో 23,531 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో పదిశాతం ఉద్యోగులను తొలగిస్తున్నారు. తొలగించిన ఉద్యోగులకు ఆరోగ్య బీమాను డిసెంబర్ 2020 వరకు కొనసాగిస్తున్నట్లు సీఈవో తెలిపారు. అవసరమైతే ఆ తర్వాత కూడా కొనసాగిస్తామని వెల్లడించారు. సొంత ఊళ్ళకు వెళ్లాలనుకునే వారికి వన్-వే టిక్కెట్ ఇస్తామన్నారు.

బాధాకర నిర్ణయం తీసుకోక తప్పలేదు
ప్రస్తుత ఆర్థిక సంక్షోభంలో కొన్ని త్యాగాలు చేయకుండా సంస్థను ముందుకు తీసుకు వెళ్లడం సాధ్యం కాదని రోనోదత్తా పేర్కొన్నారు. కాబట్టి సాధ్యమయ్యే అంశాలను పరిశీలించిన తర్వాతనే ఉద్యోగుల్లో పది శాతం మందిని తొలగించాలని బాధాకరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అన్ని కోణాల్లో జాగ్రత్తగా అంచనా వేసి, సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం తమ ఎయిర్ లైన్స్ చరిత్రలో మొదటిసారి అన్నారు.

కరోనా దెబ్బ..
ప్రస్తుత పరిస్థితుల్లో 250 విమానాల్లో కొన్ని సర్వీసులు మాత్రమే నడుపుతోంది. 62 డొమెస్టిక్ డెస్టినేషన్స్, 24 ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్కు విమానాలు నడుపుతోంది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం సుదీర్ఘ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలు షట్ డౌన్ విధించడంతో గ్లోబల్ వ్యాప్తంగా విమానయానం ఇబ్బందుల్లో పడింది. దీంతో వివిధ దేశాల్లో వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు. మన విమానయానంపై కూడా ఈ ప్రభావం పడింది. లాక్ డౌన్ నిబంధనల సడలింపుల నేపథ్యంలో దాదాపు 3 నెలల తర్వాత మే 25వ తేదీ నుండి కేవలం 50 శాతం నుండి 60 శాతం ఆక్యుపెన్సీ రేటుతో విమాన సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయినా డిమాండ్ అంతంత మాత్రంగా ఉండటంతో ఆదాయాలు క్షీణించాయి.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications