భారతదేశాన్ని గ్లోబల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే, ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఐఫోన్ (iPhone) తయారీదారులకు ఒక తీపి కబురు అందించారు. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ , దాని భాగస్వామ్య కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేలా పన్ను నిబంధనలలో కీలక మార్పులు చేశారు.

విదేశీ కంపెనీలకు పన్ను ఊరట
కొత్త నిబంధనల ప్రకారం.. ఆపిల్ వంటి విదేశీ కంపెనీలు తమ భారతీయ కాంట్రాక్ట్ తయారీదారులకు (ఫాక్స్కాన్, టాటా వంటివి) ఐదేళ్ల వరకు ఎటువంటి పన్ను భారం లేకుండా యంత్రాలను (Machinery) సరఫరా చేయవచ్చు. ఈ పన్ను మినహాయింపు 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు అందుబాటులో ఉంటుంది. గతంలో విదేశీ కంపెనీలు ఇలా యంత్రాలను పంపితే దాన్ని 'బిజినెస్ ట్రాన్సాక్షన్' గా పరిగణించి పన్ను వేసేవారు. దీనివల్ల ఆపిల్ లాభాలపై అదనపు భారం పడేది. ఇప్పుడు ఆ చిక్కులు తొలగిపోయాయి.
ఎగుమతులే లక్ష్యం
ఈ నిర్ణయం వెనుక కేంద్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైన వ్యూహం ఉంది. భారతదేశం నుండి ఐఫోన్ ఎగుమతులను భారీగా పెంచడమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఈ ఫ్యాక్టరీలలో తయారయ్యే వస్తువులను దేశీయంగా అమ్మితే మాత్రం యధావిధిగా దిగుమతి సుంకాలు వర్తిస్తాయి. దీనివల్ల ప్రపంచ మార్కెట్ లో భారత్ వాటా పెరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న ఐఫోన్లలో భారత్ వాటా 25 శాతానికి చేరింది. చైనా వాటా 75 శాతంగా ఉంది. ఈ పన్ను ఊరటతో చైనాకు గట్టి పోటీ ఇచ్చేలా భారత్ ఎదగనుంది.
శాంసంగ్కు లేని చిక్కులు, ఆపిల్కే ఎందుకు?
ఆపిల్ కంపెనీ తన ఐఫోన్లను సొంతంగా తయారు చేయకుండా ఫాక్స్కాన్, విస్ట్రాన్, టాటా వంటి కాంట్రాక్ట్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ ద్వారా తయారు చేయిస్తుంది. అందుకే పాత పన్ను నిబంధనలు ఆపిల్కు ఇబ్బందిగా మారాయి. కానీ, శాంసంగ్ వంటి కంపెనీలు తమ ఫోన్లను సొంత ఫ్యాక్టరీలలోనే తయారు చేసుకుంటాయి. కాబట్టి వాటికి పాత నిబంధనలతో పెద్దగా ఇబ్బంది లేదు. ఆపిల్ చేసిన పలు విన్నపాల మేరకు కేంద్రం ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది.
మార్కెట్ లో పెరుగుతున్న క్రేజ్
భారతదేశంలో ఐఫోన్ల వినియోగం గత రెండేళ్లలో రెట్టింపు అయింది. మార్కెట్ రీసెర్చ్ ప్రకారం ఇండియాలో ఐఫోన్ మార్కెట్ వాటా 8 శాతానికి పెరిగింది. ప్రభుత్వం ఇచ్చిన ఈ తాజా పన్ను ఊరటతో ఆపిల్ తన ఇన్వెస్ట్మెంట్ లను మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది. దీనివల్ల దేశంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా టెక్నాలజీ పరంగా భారత్ మరో మెట్టు ఎక్కనుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications