కొత్త కార్యదర్శి కోసం ఆర్థిక వ్యవహారాల శాఖ వెతుకులాట!
భారత ప్రభుత్వ ఆర్థికమంత్రిత్వ శాఖలో ఆర్థిక వ్యవహారాల శాఖ (DEA) కొత్త కార్యదర్శి కోసం వెతుకుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బాధ్యతలను నిర్వహిస్తున్న 1987 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ ఐఏఎస్ అధికారి అజయ్ సేథ్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అతను చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్కు ఈ నెలాఖరు వరకు డీఈఏ బాధ్యతలను అప్పగించింది.
సమాచారం మేరకు ఏప్రిల్ 30వ తేదీ నాటికి అజయ్ సేథ్ తిరిగి బాధ్యతలు నిర్వర్తించే అవకాశాలు లేవని చెబుతున్నారు. కాబట్టి ప్రభుత్వం పూర్తి సమయ కార్యదర్శి కోసం డీఈఏ వెదుకుతోంది. తాత్కాలిక కార్యాలయ బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణ్ బజాజ్ ఈ పదవికి బలమైన పోటీదారు. సేథ్ స్థానాన్ని భర్తీ చేయడానికి ముందు అతను ఈ పదవిని నిర్వర్తించాడు.
తీవ్ర అనారోగ్యంతో ఉన్న సేథ్, ఆలస్యంగా ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. సేథ్ లేకపోవడం ఆర్థిక మంత్రిత్వ శాఖలో కుదుపుకు అవకాశం ఉందని అంటున్నారు. మినిస్ట్రీలో రెండు అత్యున్నత పదవుల కోసం ఆశావహుల జాబితా చాలానే ఉంది. సమాచారం మేరకు బజాజ్ కొత్త కార్యదర్శిగా బాధ్యతలు చేపడితే పెట్టుబడి, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్(DIPAM) కార్యదర్శి తుహిన్ కాంత పాండేకు రెవెన్యూ కార్యదర్శి బాధ్యతలు అప్పగించవచ్చు.