హెచ్1బీ వీసా జారీ ప్రక్రియకు సంబంధించి అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. 2022 ఆర్థిక సంవత్సరంలో హెచ్1బీ వీసాల జారీకి సంబంధించి ప్రాథమిక ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ఎంపిక ప్రక్రియను అమెరికా పూర్తి చేసింది. సరైన ఆధారాలతో సమర్పించిన దరఖాస్తులు పరిశీలించి లాటరీ విధానంలో ఎంపిక చేయనున్నట్లు యూఎస్ సీఐఎస్ తెలిపింది. అమెరికా కంపెనీల్లో పని చేయాలంటేన విదేశీ వృత్తి నిపుణులకు హెచ్1బీ వీసా తప్పనిసరి. భారత్, చైనా సహా వివిధ దేశాల నుండి డిమాండ్ ఉంది.
ఇదిలా ఉండగా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తీసుకు వచ్చిన హెచ్1బీ వీసా నిషేధాన్ని కొనసాగించకూడదని ప్రస్తుత అధ్యక్షులు జోబిడెన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ తెచ్చిన హెచ్1బీ వీసా నిషేధ కాల వ్యవధి బుధవారం ముగుస్తుండగా, దీనిని పొడిగించకూడదని బిడెన్ భావించారు. ఈ నిషేధం కారణంగా పలు టెక్ కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మైక్రోసాఫ్ట్, టెస్లా, గూగుల్ వంటి కంపెనీల అధిపతులు కూడా ట్రంప్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే ఈ విషయమై శ్వేతసౌధం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. నిషేధాన్ని వెంటనే ఎత్తివేస్తే అమెరికా కంపెనీలకు మంచిది కాదని, అందువల్ల నెమ్మదిగా తొలగించాలని కొంతమంది భావిస్తున్నారు. కరోనా కారణంగా కొత్త గ్రీన్ కార్డులు జారీ చేయకూడదన్న ట్రంప్ నిర్ణయాన్ని బిడెన్ రద్దు చేశారు. ఈ నిర్ణయాలు అమెరికాకు, ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలమని బిడెన్ చెబుతున్నారు. వీసాపై నిషేధాన్ని అమెరికాలో లేబర్ యూనియన్లు స్వాగతించాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications