జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ అత్యధిక త్రైమాసిక ఏకీకృత ఆదాయాన్ని నమోదు చేసింది. అయినప్పటికీ వరుసగా ఆరో త్రైమాసికంలో నష్టాలను నమోదు చేసింది. అయితే నష్టాలు మాత్రం తగ్గాయి. ఎయిర్టెల్ ఏకీకృత ఆదాయం 22 శాతం పెరిగి రూ.25,785 కోట్లుగా ఉండగా, నికర నష్టం రూ.763 కోట్లుగా ఉంది. కంపెనీకి ఇదే అత్యధిక ఆదాయం. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నష్టం రూ.23,045 కోట్లుగా ఉంది. ఏజీఆర్ బకాయిల కోసం రూ.28,450 కోట్లను కేటాయించడం వల్ల అప్పుడు భారీ నష్టాలు చూసింది.

ఆర్పు మూడేళ్ల గరిష్టం
కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోం కావడంతో డేటా వినియోగం పుంజుకుంది. దీనికి తోడు టెలికం సేవల ఛార్జీల పెరుగుదల కలిసి వచ్చి ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. జూలై-సెప్టెంబర్లో ఎయిర్టెల్ ARPU మూడేళ్ల గరిష్ఠ స్థాయి రూ.162కు చేరుకుంది. ఈ ఏప్రిల్-జూన్ క్వార్టర్లో ఇది రూ.157గా ఉంది. గత ఏడాది జూలై-సెప్టెంబర్ కాలంలో రూ.128గా నమోదయింది. ఆదాయం, ARPU పుంజుకున్నప్పటికీ రూ.763 కోట్ల నష్టాలను నమోదు చేసింది. గత ఏడాది నష్టంతో(రూ.23,045 కోట్లు) పోలిస్తే చాలా తక్కువ. లాభదాయకతను మెరుగుపరిచేందుకు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తామని ఎయిర్టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ పేర్కొన్నారు.

డేటా ఉపయోగం 58% అప్
దేశంలో ఎయిర్టెల్ ఆదాయం 22 శాతం పెరిగి రూ.18,747 కోట్లుగా నమోదయింది. మొబైల్ ఆదాయంలో 26 శాతం వృద్ధి నమోదు చేసింది. ఏడాది క్రితంతో పోలిస్తే 4జీ డేటా వినియోగదారుల సంఖ్య 48.1 శాతం పెరిగి 15.27 కోట్లకు చేరుకుంది. నెలకు నెలకు ఒక వినియోగదారు సగటు డేటా వినియోగం 16 జీపీకాగా, వాయిస్ కాల్స్ వినియోగం నెలకు 1,005 నిమిషాలు.
ఘనా దేశ మార్కెట్లో నుండి వైదొలిగినట్లు ఎక్స్చేంజీలకు తెలిపింది. టెలికాం సేవలకు అంతగా డిమాండ్ ఉండని సీజన్ అయినప్పటికీ కంపెనీ మాత్రం 22 శాతం ఆదాయ వృద్ధితో పటిష్ఠమైన పనితీరును కనబర్చిందని ఎయిర్టెల్ ఇండియా, దక్షిణాసియా ఎండీ, సీఈఓ గోపాల్ విఠల్ అన్నారు. తమ కస్టమర్ల డేటా వినియోగం వార్షిక ప్రాతిపదికన 58 శాతం పెరిగిందన్నారు. మున్ముందు త్రైమాసికాల్లో లాభదాయకతను పెంచుకుంటామన్నారు.

ఎబిటా 32 శాతం అప్
2019 సెప్టెంబర్ క్వార్టర్లో ఆదాయం రూ.21,131 కోట్లు కాగా, 22 శాతం పెరిగి రూ.25,785 కోట్లు నమోదయింది. ఎబిటా రూ.8,936 కోట్లు కాగా 32 శాతం పెరిగి రూ.11,848 కోట్లు నమోదయింది. ఎబిట్ రూ.1993 కోట్లుగా ఉండగా రూ.4,412 కోట్లకు పెరిగింది. ఇది 121.4 శాతం పెరిగింది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 191 శాతం పెరిగింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications