దేశ ఐటీ రాజధాని సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరుగుతుందే కాని తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ శాఖ అధికారులు కొత్త పరిష్కార మార్గాలను పరిశీలిస్తున్నారు. తాజాగా టర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలోని ఐటీ కంపెనీలకు సంబంధించి అధికారులు పలు సిఫార్సులు చేశారు. బెంగళూరు మిర్రర్ తెలిపిన కథనం ప్రకారం ఉద్యోగులు రాకపోకలతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందన్నారు. దీనికి పరిష్కారంగా వారం మధ్యలో వర్క్ ఫ్రమ్ హోం (WFH Wednesdays) అనే వినూత్న ఆలోచనను ముందుకు తీసుకువచ్చారు.
దీంతో పాటుగా ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య అధిక రద్దీ నమోదవుతోందని గుర్తించిన అధికారులు, ఐటీ కంపెనీలు ఉదయం 7:30 నుంచే తమ కార్యాలయాలను ప్రారంభించాలన్న సూచన చేశారు. ఇది ఉదయపు ట్రాఫిక్ పీక్ గంటల్లో వాహన భారం తగ్గించడానికే కాక.. ప్రయాణ సమయంలో సమయాన్ని కూడా మించిపోవడాన్ని నివారించనుంది.ఇక ఉద్యోగులు వారంలో బుధవారం రోజు ప్రత్యేకంగా ఇంటి నుంచి పని (WFH) చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కంపెనీలకు సూచించారు. ఇది వారాంతపు ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగుల రవాణా సౌకర్యార్థం షటిల్ బస్సులు అందుబాటులో ఉంచాలని సూచనలు కూడా ప్రతిపాదించారు.

ORR వెంబడి ట్రాఫిక్ పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు మూడు రోజులపాటు ట్రాఫిక్ డేటా సేకరణ కోసం పలు కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ డేటా ఆధారంగా భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్లు రూపొందించనున్నారు.ఇక నగరంలో అక్రమ పార్కింగ్ అనేది ప్రధాన సమస్యగా ఉంది. ఈ నేపథ్యంలోనే టెక్ పార్క్ల చుట్టూ, జంక్షన్ల వద్ద అక్రమంగా పార్క్ చేసిన వాహనాలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ అధికారులు స్పష్టం చేశారు.
నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే వెంటనే వాహనాలను టోయింగ్ చేయాలని అధికారులు సూచించారు. బస్సులు, ట్రక్కులు, వాటర్ ట్యాంకర్లు బ్రేక్డౌన్ అవ్వడం వల్ల కలిగే ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ప్రత్యేకంగా తక్షణ చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించారు.దీనికి సంబంధించి ఈ రోజు సమావేశం కూడా నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం బెంగళూరు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ..సమావేశంలో అన్ని సంబంధిత శాఖలు కలిసి పని చేయడానికి అంగీకరించాయని తెలిపారు.
ట్రాఫిక్ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనడంలో ఇది మంచి ముందడుగని తెలిపారు. ఏదేమైనా బెంగళూరు నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొనడంలో అధికారులు వినూత్న మార్గాలను ఆవిష్కరిస్తూ, వాటిని సమర్థవంతంగా అమలు చేయడంపై దృష్టి పెడుతున్నారు. IT హబ్గా పేరుగాంచిన బెంగళూరుకు ఇది ఒక ఊరటనిచ్చే పరిణామంగా చెప్పుకోవచ్చు.
More From GoodReturns

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

Bengaluru: ఒక్క జీతం నమ్మకుంటే మునిగిపోవడమే! ఐటీ నిపుణులకు CA వార్నింగ్!

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications