సాధారణంగా ఎవరికైనా ఉద్యోగం పోయిందంటే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కానీ, బెంగళూరుకు చెందిన ఒక ఐటీ ప్రొఫెషనల్ మాత్రం, "నా ఉద్యోగం పోయింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను" అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా బెంగళూరు (Bengaluru) వంటి నగరాల్లో ఇల్లు కొనాలా? లేక అద్దెకు ఉండాలా? అనే సందిగ్ధంలో ఉన్నవారికి ఈయన అనుభవం ఒక పెద్ద కనువిప్పుగా మారింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

ఈఎంఐ కంటే ఫ్లెక్సిబిలిటీ ముఖ్యం!
ఆ టెక్కీ తన రెడ్డిట్ (Reddit) పోస్ట్ లో ఏం చెప్పాడంటే.. "గత ఏడాది నేను బెంగళూరులో ఒక 3BHK ఇల్లు కొనాలని వెతికాను. నా నెట్ వర్త్ చూసుకుంటే రూ. 2 కోట్ల విలువైన ఇంటిని సులభంగా కొనగలను. కానీ, నేను అప్పుడు AI మైగ్రేషన్ టీమ్ లో పని చేస్తున్నాను. రాబోయే 2 - 3 ఏళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఐటీ రంగంలో ఎలాంటి మార్పులు వస్తాయో నాకు ముందే తెలుసు. అందుకే ఆఫీస్ నుంచి గంట దూరం ప్రయాణం చేస్తూ భారీ ఈఎంఐలు (EMIs) కట్టడం కంటే, ఆఫీస్ దగ్గర్లోనే అద్దెకు ఉండాలని నిర్ణయించుకున్నాను. సరిగ్గా గత వారం నా ఉద్యోగం ఊడింది. ఇప్పుడు నా తలపై ఈఎంఐ (EMI) ల భారం లేదు కాబట్టి, ప్రశాంతంగా నా తర్వాతి కెరీర్ గురించి ఆలోచించుకోగలుగుతున్నాను" అని చెప్పుకొచ్చాడు.
బెంగళూరు రియల్ ఎస్టేట్ బుడగ పేలుతుందా?
ఈ పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బెంగళూరులో 70-80 శాతం ఇళ్ల కొనుగోలుదారులు ఐటీ ఉద్యోగులే. సర్వీస్ బేస్డ్ కంపెనీల్లో ఉద్యోగ భద్రత తగ్గుతున్న ఈ తరుణంలో, భారీ అప్పులు చేసి ఇళ్లు కొనడం ఆత్మహత్యాసదృశ్యమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఒక యూజర్ అయితే, "గ్లోబల్ యుద్ధాలు, AI ప్రభావం, మార్కెట్ లో పెరుగుతున్న ఇళ్ల సరఫరా చూస్తుంటే.. ఇప్పుడు కొనడం కంటే మరో రెండేళ్లు వేచి చూడటమే మంచిది" అని కామెంట్ చేశారు. మరికొందరు బిల్డర్లు కావాలనే 'స్టాక్ అయిపోయింది' అని అబద్ధాలు చెబుతూ ధరలను పెంచుతున్నారని ఆరోపించారు.
నిపుణులు ఏమంటున్నారు?
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నగరాల్లో ఇల్లు కొనేవారు తమ ఆదాయంలో అధిక భాగం ఈఎంఐలకే కేటాయించడం వల్ల ఆర్థికంగా బలహీనపడుతున్నారు. ఉద్యోగం పోవడం లేదా అనారోగ్యం వంటి అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు, భారీ అప్పులు ఉన్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడతాయని హెచ్చరిస్తున్నారు. బెంగళూరు (Bengaluru) లోని మౌలిక సదుపాయాలు, నీటి సమస్యలు చూస్తుంటే, కోట్లాది రూపాయలు పెట్టి ఇల్లు కొనడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
మొత్తానికి ఆ టెక్కీ చెప్పినట్లుగా.. భవిష్యత్తు అస్పష్టంగా ఉన్నప్పుడు భారీ ఆర్థిక బాధ్యతలు నెత్తిన వేసుకోకుండా, ప్రశాంతంగా ఉండటమే 'పీస్ ఆఫ్ మైండ్' అనిపిస్తోంది. ఈఎంఐ (EMI) ల ఉచ్చులో పడకుండా ఉండటమే నేటి కాలంలో అసలైన సక్సెస్ అని ఐటీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Bengaluru: టోక్యో, పారిస్లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Amaravati: అమరావతి భూముల ధరలకు మళ్ళీ రెక్కలు? రాజధాని బిల్లు తర్వాత మార్కెట్ అంచనాలు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications