Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు చెక్: ఒక్క ప్రాజెక్టుతో 40 వేల బస్సులు మాయం!

కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఐటీ కంపెనీలు కాదు, అక్కడి భయంకరమైన ట్రాఫిక్ జామ్. గంటల తరబడి సిగ్నల్స్ దగ్గర వేచి చూడటం నగరవాసులకు నిత్యకృత్యం. అయితే, ఈ సమస్యకు త్వరలోనే స్వస్తి పలకబోతోంది 'బెంగళూరు సబర్బన్ రైల్ ప్రాజెక్ట్' (BSRP). సుమారు 23,342 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, బెంగళూరు రోడ్ల మీద ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.

Bengaluru Suburban Rail Project to serve 19 lakh commuters and reduce traffic by removing 40000 buses

40 వేల బస్సులు రోడ్డుపై నుంచి అవుట్!

రైల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కంపెనీ (కర్ణాటక) లిమిటెడ్ (K-RIDE) మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మణ్ సింగ్ గారు ఇటీవల జరిగిన ఒక సదస్సులో కీలక విషయాలను పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే ప్రతిరోజూ సుమారు 19 లక్షల మంది ప్రయాణికులు రైలు మార్గంలో ప్రయాణించవచ్చని అంచనా. దీనివల్ల నగర రోడ్లపై తిరుగుతున్న సుమారు 40,000 బస్సుల అవసరం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా, ప్రయాణ సమయం కూడా సగానికి పైగా తగ్గుతుంది

సంపర్క పేరుతో నాలుగు కారిడార్లు

ఈ ప్రాజెక్ట్‌ను మొత్తం 148 కిలోమీటర్ల మేర విస్తరించారు. ఇందులో ప్రధానంగా నాలుగు కారిడార్లు ఉంటాయి. వీటికి మల్లిగే, సంపిగే, పారిజాత , కనక అనే అందమైన పేర్లు పెట్టారు. వీటన్నింటినీ కలిపి 'సంపర్క' అని పిలుస్తున్నారు. ఈ నెట్‌వర్క్ లో మొత్తం 57 స్టేషన్లు ఉంటాయి. ఇవి కేవలం రైలు స్టేషన్లు మాత్రమే కాదు, నగరంలోని 17 మెట్రో స్టేషన్లు , 22 ప్రధాన రైల్వే స్టేషన్లతో అనుసంధానించబడి ఉంటాయి. అంటే ప్రయాణికులు ఒక చోట దిగి మరో చోటికి వెళ్లడానికి ఎంతో సులభంగా మల్టీ మోడల్ కనెక్టివిటీ ఉంటుంది.

వినూత్నమైన డిజైన్లు.. డబుల్ డెక్కర్ రైలు మార్గాలు!

ఈ ప్రాజెక్ట్‌లో హైలైట్ ఏమిటంటే 'యశ్వంత్‌పూర్ ఇంటర్‌ఛేంజ్'. ఇక్కడ ఐదు అంతస్తుల స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో రెండు అండర్ గ్రౌండ్ పార్కింగ్ లెవల్స్ ఉంటాయి. విశేషం ఏమిటంటే, ఒకే మార్గంలో ఒకదానిపై ఒకటిగా రెండు రైలు కారిడార్లు (Stacked Corridors) వెళ్తాయి. ఇలాంటి నిర్మాణం బెంగళూరులో ఇదే మొదటిసారి. అలాగే ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా ఉండటానికి దాదాపు 24 లెవల్ క్రాసింగ్‌లను తొలగిస్తున్నారు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో భూసేకరణ సమస్య లేకుండా వినూత్నమైన 'ట్రాక్ షిఫ్టింగ్' టెక్నాలజీని వాడుతున్నారు.

పర్యావరణానికి పెద్దపీట

ఈ ప్రాజెక్ట్ కేవలం ప్రయాణ సౌలభ్యం కోసమే కాదు, పర్యావరణ పరిరక్షణ కోసం కూడా డిజైన్ చేశారు. స్టేషన్ల మీద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఏటా లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ప్రతి స్టేషన్‌లో వర్షపు నీటి సంరక్షణ (Water Harvesting) వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఏడాదికి 22 మిలియన్ లీటర్ల నీటిని ఆదా చేయవచ్చు. మొత్తానికి, ఈ ప్రాజెక్ట్ పూర్తయితే బెంగళూరు (Bengaluru) నగరం ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో సరికొత్తగా దర్శనమివ్వడం ఖాయం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+