బెంగళూరు బంద్, జూలై 25 నుంచి 3 రోజులు వ్యాపారులు నిరసన, GST నోటీసులపై మండిపాటు

కర్ణాటక రాజధాని, దేశ ఐటీకి కేరాఫ్ అడ్రస్ అయిన బెంగళూరు నగరంలో GST నోటీసులకు వ్యతిరేకంగా వ్యాపారులు నిరసన చేపడుతున్నారు. సిలికాన్ సిటీ బెంగళూరులోని చిన్న వ్యాపారులు UPI లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వం GST నోటీసులు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు.

పాల అమ్మకాల నుండి వీధి వ్యాపారుల వరకు అందరూ కలిసి జూలై 23 నుండి మూడు రోజుల పాటు నిరసనకు పిలుపునిచ్చినట్లు నివేదికలు వెలువడ్డాయి. చాలా మంది వ్యాపారులు ఇప్పటికే పాలు, పాల ఉత్పత్తులను అమ్మడం మానేశారు. రేపటి నుండి పోరాటం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.

నగరంలో జీఎస్టీ నోటీసుకు వ్యతిరేకంగా జూలై 25న బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నిరసనకు క్యాబ్‌లు, ఆటో డ్రైవర్లు కూడా మద్దతు తెలిపారు.ఈ పరిణామాలన్నిటినీ పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం "జిఎస్టి తెలుసుకోండి" అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Bengaluru GST protest Bengaluru traders bandh GST notices protest July 25 Bengaluru small businesses strike GST compliance issues Karnataka traders protest Bengaluru bandh news small business GST issues Bengaluru traders association GST raid protests 25

ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం వ్యాపారులకు పన్ను సమ్మతి గురించి తెలియజేయడంతో పాటుగా వారిలో జీఎస్టీ మీద విశ్వాసాన్ని పెంపొందించడంగా చెబుతున్నారు. వ్యాపారులకు సహాయం చేయడానికి.. వాణిజ్య పన్ను శాఖ ఒక హెల్ప్‌లైన్ (1800 425 6300)ను ప్రారంభించింది. సమాచార వర్క్‌షాప్‌లను నిర్వహించడానికి ఏర్పాట్లు చేయబడుతున్నాయి.

అయితే జీఎస్టీ నోటీసులను ఉపసంహరించుకోవాలని చిన్న వ్యాపారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.లేదంటే సమ్మె తప్పదని హెచ్చరిస్తున్నారు. బెంగుళూరునగరంలో జీఎస్టీ నోటీసుల అంశం రాజకీయ వివాదానికి దారితీసింది. చిన్న వ్యాపారులు జీఎస్టీ నోటీసులను వెంటనే రద్దు చేయాలని, అలాగే చిన్న తరహా వ్యాపారాలు మరియు వ్యాపారులను ప్రభావితం చేసే కఠినమైన అమలు విధానాలను పునఃసమీక్షించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జీఎస్టీ ద్వారా చిన్న వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుందని బీజేపీ ఆరోపించింది. దీనికి ప్రతిస్పందనగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ.. జీఎస్టీ నోటీసుల బాధ్యతను బీజేపీ అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వంపై మోపుతోందని మండిపడ్డారు.

రాష్ట్రంలోని చిన్న వ్యాపారులకు డిజిటల్ చెల్లింపు ద్వారా పన్ను నోటీసులు జారీ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. జీఎస్టీ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది.కాబట్టి జీఎస్టీ కౌన్సిల్ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కాదు.అయినా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి, రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖతో దీనిపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు.

2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 1.2 లక్షల కోట్ల ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవాల్సిన ఒత్తిడి కర్ణాటక పన్ను శాఖపై పెరుగుతోందని, ఇదే చర్యలకు ప్రధాన కారణమని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాలకు ₹52,000 కోట్లకు పైగా కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం, మౌలిక సదుపాయాల కోసం మరిన్ని నిధులు సమకూర్చాలని కాంగ్రెస్ శాసనసభ్యులు ఒత్తిడి తీసుకువస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+