Bengaluru: ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఏప్రిల్ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే జేబు ఖాళీ అవ్వడం ఖాయం!

కర్ణాటక వ్యాప్తంగా ఆస్తుల గైడెన్స్ వ్యాల్యూ (Guidance Value) త్వరలో పెరగనుంది. ప్రభుత్వం సుమారు 15 శాతం మేర ఈ ధరలను పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా బెంగళూరు (Bengaluru) వంటి నగరాల్లో ఇల్లు లేదా స్థలం కొనాలనుకునే వారు ఇప్పుడు అదనపు భారాన్ని మోయాల్సి రావచ్చు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించింది.

Bengaluru Property Guidance Value Hike 15 Percent Increase In Karnataka Real Estate Registration Rates 2026

గైడెన్స్ వ్యాల్యూ అంటే ఏమిటి?

సాధారణంగా ప్రభుత్వం ఒక ప్రాంతంలో భూమికి నిర్ణయించిన కనీస ధరను 'గైడెన్స్ వ్యాల్యూ' అంటారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఈ ధర ఆధారంగానే మనం స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. మార్కెట్ ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం కూడా తన ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ గైడెన్స్ వ్యాల్యూను సవరిస్తూ ఉంటుంది.

ధరలు ఎంత పెరుగుతాయి?

రెవెన్యూ శాఖ సమాచారం ప్రకారం.. ఈసారి పెంపుదల 12 నుంచి 15 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు బెంగళూరులోని ఎంజీ రోడ్డు నుంచి ఉల్సూర్ జంక్షన్ వరకు ఉన్న ప్రాంతంలో 2019లో చదరపు మీటరుకు రూ. 1,57,700 గా ఉన్న గైడెన్స్ వ్యాల్యూ.. 2023 నాటికి రూ. 1,81,500 కి పెరిగింది. ఇప్పుడు మరో 15 శాతం పెంచితే అది ఏకంగా రూ. 2,08,785 కి చేరుకుంటుంది. అంటే కేవలం రిజిస్ట్రేషన్ కోసమే మీరు లక్షల్లో అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

రెండేళ్ల తర్వాత మళ్లీ పెంపు

సాధారణంగా ప్రతి ఏటా ఈ ధరలను సవరించాల్సి ఉంటుంది. కానీ రాజకీయ కారణాల వల్ల గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోలేదు. చివరిసారిగా 2023లో ధరలు పెంచారు. ఇప్పుడు సుమారు రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ రేట్లు పెంచుతుండటంతో రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

తగ్గుతున్న రిజిస్ట్రేషన్లు.. పెరుగుతున్న ఆదాయ లక్ష్యాలు

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. బెంగళూరులో ఆస్తుల ధరలు పెరుగుతున్నప్పటికీ, రిజిస్ట్రేషన్ అయ్యే ఆస్తుల సంఖ్య మాత్రం తగ్గుతోంది. 2023-24లో కర్ణాటకలో 24.67 లక్షల ఆస్తులు రిజిస్టర్ అవ్వగా 2024-25 నాటికి అది 23.39 లక్షలకు పడిపోయింది. అయినప్పటికీ బెంగళూరులో భూముల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం తగ్గడం లేదు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం రూ. 28,000 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ టార్గెట్‌ ను అందుకోవాలంటే గైడెన్స్ వ్యాల్యూ పెంచడం ప్రభుత్వానికి అనివార్యంగా మారింది.

కొనుగోలుదారులపై ప్రభావం

ఈ నిర్ణయం వల్ల కొత్తగా ఇల్లు కొనేవారిపై ఆర్థిక భారం పెరుగుతుంది. గైడెన్స్ వ్యాల్యూ పెరిగితే ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీ కూడా పెరుగుతాయి. కాబట్టి, బెంగళూరులో స్థిరాస్తి పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఏప్రిల్ లోపు రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+