బెంగళూరులో ఈ ఏరియాలో ప్రయాణించే వారికి బిగ్ షాక్.. అమాంతం పెరిగిన టోల్ ఛార్జీలు.. ఎంతలా అంటే..

బెంగళూరు నగరంతో మధ్య- తీరప్రాంత కర్ణాటక జిల్లాలను అనుసంధానించే అత్యంత కీలకమైన నెలమంగళ-హాసన్ జాతీయ రహదారి-75 (NH-75) పై ప్రయాణించే వాహనదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నెలామంగళ-దేవరహళ్లి ఎక్స్‌ప్రెస్‌వే పరిధిలోని టోల్ ప్లాజాల వద్ద రుసుములను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన టోల్ ఛార్జీలు సెప్టెంబర్ 1వ తేదీ అర్ధరాత్రి నుంచే అధికారికంగా అమలులోకి వచ్చాయి.

ఈ పెంపు వల్ల ఈ మార్గంలో ప్రతిరోజూ ప్రయాణించే ఉద్యోగులు, పర్యాటకులు, సరుకు రవాణా చేసే వాణిజ్య వాహనదారుల జేబులకు చిల్లు పడనుంది. Bengaluru నెలమంగళ దేవిహళ్లి ఎక్స్‌ప్రెస్‌వే ప్రైవేట్ లిమిటెడ్ పర్యవేక్షణలో నిర్వహించబడుతున్న ఈ మార్గంలోని దొడ్డకరేనహళ్లి, కర్బైలు టోల్ ప్లాజాల వద్ద అన్ని రకాల వాహన వర్గాలకు ప్రాథమికంగా రూ. 5 మేర రుసుమును పెంచారు.

Nelamangala Hassan toll hike 2026 Bengaluru Hassan toll rates Nelamangala toll rates September 1 NHAI toll hike 2026 Nelamangala toll plaza Bengaluru Hassan highway toll new toll rates September 2026 FASTag toll rates Bengaluru Nelamangala Hassan highway Bengaluru Tumakuru toll rates car toll Nelamangala truck toll Nelamangala 2026 1 NHAI 2026

సవరించిన కొత్త టోల్ ధరల వివరాలు:

కార్లు, జీపులు, వ్యాన్లు (తేలికపాటి వాహనాలు): ఫాస్టాగ్ (FASTag) ద్వారా ఒకవైపు ప్రయాణానికి (Single Journey) ఇకపై రూ. 60 చెల్లించాల్సి ఉంటుంది. అదే రోజు తిరుగు ప్రయాణానికి (Return Journey) ఛార్జీని రూ. 85 నుండి రూ. 90కి పెంచారు.
తేలికపాటి వాణిజ్య వాహనాలు (LCV/LGV): ఒకవైపు ప్రయాణానికి రూ. 100 నుండి రూ. 105కి పెరిగింది. అదే రోజు డే పాస్ (Day Pass) ధర రూ. 155గా నిర్ణయించారు.
బస్సులు, ట్రక్కులు: ఒక ప్రయాణానికి సవరించిన టోల్ రుసుము రూ. 205 కాగా, డే పాస్‌కు రూ. 310 ఖర్చవుతుంది.
మల్టీ-యాక్సిల్, భారీ వాహనాలు: ఒకవైపు ప్రయాణానికి రూ. 330 కాగా, అదే రోజు తిరుగు ప్రయాణపు డే పాస్‌కు రూ. 495 వసూలు చేయనున్నారు.

Also Read

ధరల పెంపునకు కారణాలు - వాహనదారుల ఆగ్రహం:

ద్రవ్యోల్బణం, రహదారుల నిర్వహణ, పునరుద్ధరణ, మరమ్మతు వ్యయాలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారుల రుసుముల వార్షిక సర్దుబాటులో (Annual Adjustment) భాగంగానే ఈ టోల్ పెంపును చేపట్టినట్లు ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు వివరణ ఇచ్చాయి. రహదారి నాణ్యతను కాపాడటానికి, మెరుగైన మౌలిక సదుపాయాలను అందించడానికే అదనపు ఆదాయం సమకూర్చుకుంటున్నట్లు తెలిపాయి.

అయితే ఈ పెంపుపై క్రమం తప్పకుండా ప్రయాణించే వాహనదారులు, ట్రాన్స్‌పోర్టర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇంధన ధరలు, నిత్యావసర సరుకుల ధరల భారంతో సతమతమవుతుంటే, వరుసగా టోల్ ఛార్జీలు పెంచడం సరికాదని మండిపడుతున్నారు. కేవలం రూ. 5 పెంపుగా పైకి కనిపిస్తున్నప్పటికీ.. నిత్యం రాకపోకలు సాగించే వాణిజ్య వాహనదారులకు నెలవారీ బడ్జెట్‌లో ఇది పెను భారంగా మారుతుందని వాపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+