Bengaluru: బెంగుళూరు టూ ముంబై.. వందే భారత్ స్లీపర్ వచ్చేస్తోంది! డేట్ ఫిక్స్!
భారతదేశంలోని రెండు అతిపెద్ద మెట్రో నగరాలు, ఐటీ హబ్ బెంగళూరు (Bengaluru) , ఆర్థిక రాజధాని ముంబై మధ్య ప్రయాణించే వారికి ఇది నిజంగా తీపి కబురు. ఇప్పటివరకు ఈ రెండు నగరాల మధ్య నేరుగా వెళ్లేందుకు మనకు 'ఉద్యాన్ ఎక్స్ప్రెస్' ఒక్కటే ప్రధాన ఆధారం. కానీ, ఇది 1,136 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి దాదాపు 20 గంటల సమయం తీసుకుంటుంది. ఈ సుదీర్ఘ ప్రయాణ కష్టాలకు చెక్ పెడుతూ, జూన్ నెలాఖరుకల్లా సరికొత్త 'సూపర్ఫాస్ట్ వందే భారత్ స్లీపర్' రైలు అందుబాటులోకి రానుంది.

14 గంటల్లోనే ముంబైకి.. ఎలా సాధ్యం?
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ , కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కొత్త సూపర్ఫాస్ట్ రైలు ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించనుంది. ప్రస్తుతం పడుతున్న 20 గంటల సమయాన్ని ఏకంగా 14 నుండి 16 గంటలకు కుదించనున్నారు. అంటే దాదాపు 4 నుండి 6 గంటల సమయం ఆదా అవుతుంది. ఇది బిజినెస్ పనుల మీద వెళ్లే వారికి, పర్యాటకులకు ఎంతో ఊరటనిచ్చే అంశం.
కొత్త రూట్.. తక్కువ ట్రాఫిక్!
సాధారణంగా రైళ్లు సోలాపూర్ మీదుగా వెళ్తుంటాయి, అక్కడ రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల తరచుగా ఆలస్యమవుతుంటాయి. కానీ ఈ కొత్త సూపర్ఫాస్ట్ ట్రైన్ సెంట్రల్ కర్ణాటక కారిడార్ మీదుగా ప్రయాణించనుంది. ఇది బెంగళూరు (Bengaluru) నుంచి బయలుదేరి తుమకూరు, దావణగెరె, హవేరి, హుబ్బళ్లి, ధార్వాడ్ , బెల్గావి మీదుగా ముంబై చేరుకుంటుంది. ఈ కొత్త రూట్ వల్ల ప్రయాణ దూరం తగ్గడమే కాకుండా, హుబ్బళ్లి, బెల్గావి వంటి ఎదుగుతున్న వాణిజ్య నగరాలకు కనెక్టివిటీ పెరుగుతుంది.
విమానానికి తక్కువ.. సాదా ట్రైన్కు ఎక్కువ!
ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ అధునాతన సౌకర్యాలతో రాబోతోంది. ఇందులో మొత్తం 16 ఎయిర్ కండిషన్డ్ కోచ్లు ఉంటాయి. ఎర్గోనామిక్స్ పద్ధతిలో డిజైన్ చేసిన స్లీపింగ్ బెర్తులు, ప్రయాణం కుదుపులు లేకుండా ఉండేందుకు 'అడ్వాన్స్డ్ సస్పెన్షన్ సిస్టమ్'ను ఇందులో ఏర్పాటు చేశారు. ఈ రైలు గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుంది. అంటే మీరు రాత్రి పడుకుంటే, ఉదయానికల్లా ముంబైలో దిగిపోవచ్చు!
స్టేషన్ల అభివృద్ధి కూడా..
కేవలం రైలు మాత్రమే కాదు, ప్రయాణికుల సౌకర్యార్థం హుబ్బళ్లి రైల్వే స్టేషన్ను కూడా భారీ స్థాయిలో రీ-డెవలప్ చేస్తున్నారు. పెరగబోయే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్టేషన్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పించబోతున్నారు. జూన్ నెలాఖరున ఈ రైలు పట్టాలెక్కే అవకాశం ఉందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తక్కువ సమయంలో, లగ్జరీగా ముంబై వెళ్లాలనుకునే బెంగళూరు (Bengaluru) వాసులకు ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది.


Click it and Unblock the Notifications