A Oneindia Venture

బెంగళూరు వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 175 కిలోమీటర్ల మేర మెట్రో లైన్‌పై కీలక అప్ డేట్

బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారంగా మెట్రో విస్తరణను వేగవంతం చేస్తున్నట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. డిసెంబర్ 2027 నాటికి బెంగళూరులో మొత్తం 175 కిలోమీటర్ల మెట్రో లైన్ నెట్‌వర్క్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆయన ప్రకటించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

మెట్రో నిర్మాణ పురోగతిపై బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి ఈ వివరాలను వెల్లడించారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న వాహన రద్దీని తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందులో భాగంగానే మెట్రో ప్రాజెక్టులను ప్రాధాన్యంగా చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం బెంగళూరులో 96 కిలోమీటర్ల Bengaluru మెట్రో నెట్‌వర్క్ విజయవంతంగా పనిచేస్తోందని శివకుమార్ తెలిపారు. ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎల్లో లైన్‌ను ప్రారంభించినట్లు గుర్తుచేశారు. 24 కిలోమీటర్ల పొడవున్న ఈ ఎల్లో లైన్ ద్వారా రోజుకు లక్ష మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని తెలిపారు. పోలీసు శాఖ గణాంకాల ప్రకారం.. ఎల్లో లైన్ పరిధిలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ దాదాపు 30 శాతం మేర తగ్గినట్లు వెల్లడైంది. ఇది మెట్రో ప్రజా రవాణా వ్యవస్థ ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

Bengaluru Metro Bangalore Metro expansion 175 km metro network Bengaluru traffic relief Namma Metro project Bengaluru urban transport metro connectivity 2027 Bengaluru public transport metro rail expansion India Bengaluru infrastructure development traffic congestion solution Bengaluru Namma Metro Phase expansion 175 2027

రాష్ట్ర ప్రభుత్వం 2026 నాటికి మరో 41 కిలోమీటర్ల మెట్రో నెట్‌వర్క్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుందని డిప్యూటీ సీఎం తెలిపారు. అలాగే డిసెంబర్ 2027 నాటికి విమానాశ్రయ మార్గంతో సహా మరో 38 కిలోమీటర్ల మెట్రో లైన్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇవన్నీ పూర్తయితే బెంగళూరులో మొత్తం మెట్రో నెట్‌వర్క్ పొడవు 175 కిలోమీటర్లకు చేరుకుంటుందని వివరించారు.

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో విస్తరణను నగర సరిహద్దుల వరకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోందని శివకుమార్ చెప్పారు. తవరెకెరె, హోసకోటే, బిదాడి, నెలమగల వంటి ప్రాంతాల వరకు మెట్రో లైన్‌ను విస్తరించే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని, ఇందుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ప్రస్తుతం తయారవుతోందని వెల్లడించారు.

నమ్మ మెట్రో ఫేజ్-3 కింద 100 కిలోమీటర్ల కొత్త మెట్రో నెట్‌వర్క్ కోసం ప్రభుత్వం వచ్చే నెలలో టెండర్లు పిలవనున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇందులో డబుల్ డెక్కర్ కారిడార్ కూడా భాగంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఫేజ్-3 ప్రాజెక్ట్‌కు అంచనా వ్యయం రూ.25,311 కోట్లుగా నిర్ణయించారని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (JICA) ద్వారా రూ.15,600 కోట్ల నిధులు సమకూరుస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన రూ.9,700 కోట్ల విలువైన పనులకు జనవరిలో టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు.

ఫేజ్-3 మొత్తం ప్రాజెక్ట్‌ను డబుల్ డెక్కర్ ఫార్మాట్‌లో నిర్మించనున్నట్లు డీకే శివకుమార్ స్పష్టం చేశారు. హాసన్ నుంచి బెంగళూరు వైపు వచ్చే వాహనాల రాకపోకలు అధికంగా ఉండే మాగడి రోడ్డును కూడా డబుల్ డెక్కర్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+