IT News: హాట్ హాట్ సమ్మర్‌లో టెక్కీలకు కూల్ ఆఫర్..!

Tech News: టెక్కీలు సమ్మర్ హీట్ నుంచి ఉపసమనం పొందే కూల్ ఆఫర్ ఒకటి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే చాలా మంది ఈ డీల్ కుదిరితే బాగుంటుందని భావిస్తున్నారు.

దేశంలో ఐటీ కంపెనీలకు, వాటి కార్యకలాపాలకు చాలా కాలంగా కర్ణాటకలోని బెంగళూరు కేంద్రంగా ఉన్న సంగతి తెలిసిందే. భారత సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో టెక్ కంపెనీలతో పాటు లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. అయితే ఈ ఏడాది వేసి ప్రారంభంలోనే నీటి ఎద్దడి నగరంలో నివశించే ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. బెంగళూరు వాసులు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వేళ దీనిని క్యాష్ చేసుకునేందుకు సూపర్ ఆఫర్ ప్రకటించింది.

Kerala writes to top IT firms in Bengaluru offers office space

దేశంలోని టెక్ హబ్‌లో నీటి సంక్షోభం ఉన్నట్లు నివేదికలు వెలువడిన తర్వాత కోస్తా రాష్ట్రమైన కేరళ టెక్ కంపెనీల ఏర్పాటు, విస్తరణ కోసం ఉన్న అవకాశాలను పరిగణించాలని బెంగళూరులోని అగ్రశ్రేణి టెక్నాలజీ కంపెనీలను సంప్రదించింది. తాము అన్ని సౌకర్యాలతో పాటు పుష్కలంగా నీటిని అందిస్తామని టెక్ కంపెనీలకు కేరళ ప్రభుత్వం లేఖ రాయటం ఆశ్చర్యానికి గురిచేసింది. తమ రాష్ట్రంలో మెుత్తం 44 నదులు ఉన్నాయని పేర్కొంది. అయితే అందమైన కేరళలో టెక్ కంపెనీల ఏర్పాటుపై చాలా మంది టెక్కీలు సుముఖంగా ఉన్నారు. ప్రకృతి ఒడిలో పనిచేసుకోవటం బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం బెంగళూరు నగరం దేశంలోని 254 బిలియన్ డాలర్ల ఐటీ పరిశ్రమకు కేంద్రంగా ఉంది. ఈ సారి వేసవి ప్రారంభంతో దాదాపు 500 మిలియన్ లీటర్ల రోజువారీ నీటి కొరతతో ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలోనే.. ప్రెస్టీజ్ గ్రూప్ కొచ్చిలో 8.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టెక్ పార్క్‌ను నిర్మించగా, తిరువనంతపురంలో బ్రిగేడ్ గ్రూప్ ఇదే విధమైన పార్కును నిర్మిస్తోంది. కొచ్చిలోని ఇన్ఫోపార్క్ దాని స్వంత సౌకర్యాలను కలిగి ఉంది. ప్రైవేట్ డెవలపర్లు బ్రిగేడ్, కార్నివాల్, లులు గ్రూప్, ఆసియా సైబర్ పార్క్ ద్వారా నిర్మించబడ్డాయి. రాష్ట్రంలో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయని, మంచి రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీ కూడా ఉన్నాయని కేరళ పరిశ్రమలు & న్యాయ శాఖ మంత్రి పి రాజీవ్ చెప్పారు.

పెట్టుబడుల కోసం రాష్ట్రం చేసిన అభ్యర్థనను కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందని, తన అధికారులు రాసిన కంపెనీల పేర్లను వెల్లడించడానికి నిరాకరించారని రాజీవ్ చెప్పారు. తాము ఇప్పటికే వారిలో కొందరితో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. మొత్తం రాష్ట్రాన్ని సిలికాన్ వ్యాలీ తరహాలో అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. టెక్నాలజీ గ్రాడ్యుయేట్ల విస్తారమైన టాలెంట్ పూల్‌తో సహా టెక్ సెక్టార్‌ని హోస్ట్ చేయడం వల్ల కేరళకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు.టెక్ దిగ్గజం ఐబీఎమ్ సైతం కొచ్చిలో తన ల్యాబ్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+