Hyderabad: హైదరాబాద్ ఫుడ్ లవర్స్కి గుడ్న్యూస్.. మాదాపూర్లో రామేశ్వరం కేఫ్..
Rameshwaram Cafe: వ్యాపారానికే కాదు ఆహారానికి సైతం హైదరాబాద్ మహానగరం ఎంతో ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేంది బిర్యానీ. అయితే ఇప్పుడు నగరంలోని ప్రజలకు విభిన్న రుచులను అందించేందుకు అనేక కంపెనీలు పోటీ పడుతున్నాయి.
బెంగళూరులో ప్రసిద్ధి చెందిన రామేశ్వరం కేఫ్ ఇప్పుడు తన వ్యాపారాన్ని హైదరాబాదుకు సైతం విస్తరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న పోటీలో ఆహార రంగంలో విజయవంతంగా ముందుకు సాగటం అంత సులువు కాదు. ఇప్పటికే కర్ణాటకలో ఉన్న శాఖల ద్వారా కంపెనీ ఏకంగా రూ.50 కోట్ల వరకు వ్యాపారాన్ని చేస్తోంది. నగరంలోని ఇందిరా నగర్, JP నగర్, బ్రూక్ఫీల్డ్, రాజాజీ నగర్లలో నాలుగు శాఖలు ఉన్నాయి.

ని హైదరాబాద్ టెక్ సెంటర్లో జనవరి 19,2024న వినియోగదారుల కోసం తెరవబడింది. సహ వ్యవస్థాపకులు రాఘవేంద్రరావు & దివ్య రాఘవేంద్రరావు రామేశ్వరం కేఫ్ ఆదాయం, ఔట్లుక్, అవుట్లెట్ల గురించి మాట్లాడారు. ఇక్కడ నెయ్యి పొడి ఇడ్లీ, మసాలా దోస వంటి దక్షిణ భారత సాంప్రదాయ అల్పాహార వంటకాలకు ప్రసిద్ధి. రెస్టారెంట్ నెలకు రూ.4.5 కోట్లు అలాగే ఏడాదికి రూ.50 కోట్లకు పైగా సంపాదిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
బెంగళూరులోని ఇందిరానగర్ నివాసితులు పదేపదే ఫిర్యాదు చేయడంతో, BBMP రామేశ్వరం కేఫ్ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అన్ని ఫిర్యాదుల మధ్య, నిషేధించబడిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను ఉపయోగించినందుకు బెంగళూరు పౌర సంఘం రెస్టారెంట్ను తాత్కాలికంగా మూసివేసింది. కేఫ్ లో ప్రత్యేకమైన నెయ్యి ఇడ్లీ ధర రూ.84, అవకాడో ఇడ్లీ రేటు రూ.84గా ఉన్నాయి. ఇదే క్రమంలో వీరి వద్ద పెరుగు వడ, మసాలా వడ, కాంచీపురం ఇడ్లీ, మినీ వడ సాంబార్ డిప్, రవ్వ ఇడ్లీ వంటి ఆహారాలు ఎక్కువగా ఫేమస్ అయ్యాయి. రామేశ్వరం కేఫ్ పూర్తిగా శాఖాహార పదార్థాలను మాత్రమే సర్వ్ చేస్తుంది.


Click it and Unblock the Notifications


