వేసవి కాలం వచ్చిందంటే చాలు, భానుడి భగభగలకు తట్టుకోలేక జనం చల్లని పానీయాల వైపు మొగ్గు చూపుతారు. ముఖ్యంగా ప్రకృతి ప్రసాదించిన అమృతం లాంటి కొబ్బరి నీళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే ఈ ఏడాది ఎండల కంటే ముందుగానే కొబ్బరి బోండాల ధరలు మండిపోతున్నాయి. ఐటీ సిటీ బెంగళూరు (Bengaluru) లో ఒక లీటర్ కొబ్బరి నీళ్ల ధర వింటే సామాన్యులు అవాక్కవుతున్నారు. అక్కడ ఒక లీటర్ బాటిల్ కొబ్బరి నీళ్లను ఏకంగా రూ. 180 కి విక్రయిస్తుండటం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్తో పోలిస్తే భారీ వ్యత్యాసం
మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కూడా కొబ్బరి నీళ్ల ధరలు ఏరియాను బట్టి మారుతుంటాయి. బస్తీల్లో లీటర్ బాటిల్ ధర రూ. 100 నుంచి రూ. 120 వరకు అమ్ముతుండగా, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ఏరియాల్లో రూ. 150 వరకు వసూలు చేస్తున్నారు. కానీ, బెంగళూరులో రూ. 180 అంటే మే నెల నాటికి ఇది రూ. 200 దాటినా ఆశ్చర్యం లేదని అక్కడి జనం వాపోతున్నారు. లీటర్ అని చెప్పి అమ్ముతున్న బాటిళ్లలో క్వాంటిటీ కూడా పూర్తిగా లీటర్ ఉండదని సుమారు -800 మి.లీ. ఉంటోందని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు.
ఆరోగ్యంపై శ్రద్ధ.. వ్యాపారులకు లాభం
కరోనా మహమ్మారి తర్వాత ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. సాఫ్ట్ డ్రింక్స్ కంటే కొబ్బరి నీళ్లు తాగడమే మేలని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండటానికి, ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి కొబ్బరి నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. ప్రజల అవసరాన్ని ఆసరాగా చేసుకుని, సమ్మర్ సీజన్ను క్యాష్ చేసుకునేందుకు వ్యాపారులు ధరలను అమాంతం పెంచేస్తున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ధరలు 20 నుంచి 30 శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం.
సామాన్యుడికి భారంగా మారిన ప్రకృతి ప్రసాదం
మధ్యతరగతి జనం బయటకు వెళ్లినప్పుడు దాహం తీర్చుకోవడానికి గతంలో కొబ్బరి బోండాలను ఆశ్రయించేవారు. కానీ ఇప్పుడు ఒక్కో బోండాం ధర రూ. 60 నుంచి రూ. 80 కి చేరడంతో, అది సామాన్యుడికి అందుబాటులో లేని 'లగ్జరీ' డ్రింక్లా మారిపోయింది. "ప్రకృతి సిద్ధంగా దొరికే నీళ్లకు ఇంత రేటు పెంచడం దారుణం" అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. విదేశీ కూల్ డ్రింక్స్ కంటే మన దేశీయ పానీయాలను ప్రోత్సహించాలనుకున్నా, ఈ ధరలు చూసి వెనకడుగు వేయాల్సి వస్తోందని సగటు మనిషి అభిప్రాయపడుతున్నాడు.
ప్రస్తుతం బెంగళూరు (Bengaluru) , హైదరాబాద్ (Hyderabad) వంటి నగరాల్లో కొబ్బరి నీళ్ల ధరలు చూస్తుంటే, ఇది కేవలం దాహం తీర్చుకోవడమే కాదు, ఒక ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. రవాణా ఖర్చులు, ఎగుమతులు , పెరిగిన డిమాండ్ కారణంగా ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నా, సామాన్యుడిపై పడుతున్న భారం మాత్రం తక్కువేమీ కాదు. ప్రభుత్వం ఇలాంటి నిత్యావసర ఆరోగ్య పానీయాల ధరలపై కొంత నియంత్రణ ఉంచితే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఎండలు ముదిరే కొద్దీ ఈ రేట్లు ఇంకా ఎక్కడికి చేరుతాయో వేచి చూడాలి.
More From GoodReturns

బెంగళూరును కుదిపేస్తున్న ఎల్పిజి కొరత.. కొనేవారు లేక బోసిపోయిన కూరగాయల మార్కెట్లు..

Bengaluru: బెంగళూరులో ఫుడ్ ధరలకు రెక్కలు! దోశ, ఇడ్లీ రేట్లు ఎంత పెరిగాయో తెలుసా?

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: బెంగళూరు మెట్రోకు ఏమైంది? విస్తరణ జరుగుతున్నా పెరగని ప్రయాణికుల సంఖ్య!

Bengaluru: గ్లోబల్ టెక్ రేసులో దూసుకుపోతున్న బెంగళూరు! పారిస్, టోక్యోలను వెనక్కి నెట్టి ఆరో స్థానంలో!

Bengaluru: బెంగళూరు మేక్రి సర్కిల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్: రూ. 420 కోట్లతో భారీ ఫ్లైఓవర్!

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: జాబ్ పోయినా నాకు టెన్షన్ లేదు! ఎందుకంటే... బెంగళూరు టెక్కీ వైరల్ పోస్ట్!

Success story: షుగర్ లేని స్వీట్లతో కోట్లల్లో లాభాలు! సాఫ్ట్వేర్ దంపతుల సక్సెస్ స్టోరీ..!

బెంగళూరు హౌసింగ్ మార్కెట్ ఢమాల్.. ఒరాకిల్ లేఆప్స్ దెబ్బకు ఉద్యోగులు విలవిల..

Hyderabad: హైదరాబాద్లో ఇళ్ల ధరల విస్ఫోటనం..! చిన్నగా మారుతున్న అపార్ట్మెంట్లు!



Click it and Unblock the Notifications