Narayana Murthy: ఇన్ఫోసిస్ కంపెనీని విజయవంతగా నడిపిన బిలియనీర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి. తాజాగా ఆయన పాల్గొన్న ఒక చర్చలో కీలకమైన కామెంట్స్ చేశారు.
యువ టెక్కీలు వారానికి కనీసం 70 గంటలు పనిచేయాలంటూ ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారిపోయాయి. అనేక మంది స్టార్టప్ వ్యవస్థాపకులు, కొందరు బిజినెస్ కమ్యూనిటీలోని వ్యక్తులు మూర్తి చెప్పింది నిజమే అంటూ సమర్థిస్తున్నారు. ఇదే క్రమంలో టెక్కీల నుంచి దీనిపై తీవ్ర విమర్శలు సైతం ఎదురవుతున్నాయి. నెట్టింట్లో మీమ్స్, షార్ట్ వీడియోలో సైతం కొంత మంది చేసేస్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ప్రముఖ గుండె డాక్టర్ దీనిపై స్పందించారు.

బెంగళూరుకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి ఇన్ఫోసిస్ నారాణయమూర్తి వ్యాఖ్యలతో ఏకీభవించలేదు. ప్రతి మనిషికి రోజుకు కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉంటుందని తాను నమ్ముతానని తన ట్వీట్ లో వెల్లడించారు. వారానికి ఎవరైనా 6 రోజులు పనిచేసినట్లయితే రోజుకు 12 గంటలు వృత్తి కోసం వెచ్చిస్తున్నట్లని అన్నారు.
ఇక మనకు మిగిలేది 12 గంటలు మాత్రమే. ఇందులో 8 గంటలు నిద్రకు, నాలుగు గంటలు మిగిలిన రోజువారీ పనులకు వెచ్చించాల్సి ఉంటుందన్నారు. బెంగళూరు మహానగరంలో నివశించే ప్రజలు మిగిలిన నాలుగు గంటల సమయంలో రెండు గంటలు ట్రాఫిక్ పైనే గడుపుతారన్నారు. ఇక అందరికీ మిగిలేది 2 గంటలు.. ఇందులోనే కాళ్లకృత్యాలు, తినటం వంటి ఇతర పనులు ఉంటాయని పేర్కొన్నారు.
డాక్టర్ చెప్పిన వివరాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. ఈ క్రమంలో వ్యక్తులకు కుటుంబంతో గడిపేందుకు, సోషలైజ్ అయ్యేందుకు, వినోదానికి, వ్యాయామం చేసేందుకు అస్సలు సమయం ఉండటం లేదని చెప్పారు. ఇంత ఒత్తిడితో కొనసాగుతున్న జీవితాల వల్లే ఎక్కువ మందికి చిన్న వయస్సులోనే గుండె పోటు సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తున్న చాలా మంది డాక్టర్ చెప్పిన దానిలో వాస్తవం ఉందని అభిప్రాయపడుతున్నారు. తక్కువ పనిగంటలతో ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించటం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రజలు ఆశ్వాధించొచ్చని డాక్టర్ అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications