ఒక్కరోజులోనే బెంగుళూరు ఆగమాగం, ఆటోడ్రైవర్ల దందా..ప్రయాణికులు జేబులకు చిల్లులే చిల్లులు

Bike-Taxi Ban in Karnataka: కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా బైక్, ట్యాక్సీ సేవలను నిలిపివేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో నిన్నటి నుంచి ఈ సేవలు బ్యాన్ అయ్యాయి. అయితే నిషేధం తర్వాత ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. బైక్ ట్యాక్సీల నిషేధం తరువాత ఆటోవాలాలు ప్రయాణికుల నడ్డి విరిచారు. ఇష్టం వచ్చినట్లుగా రేట్లు చెప్పడంతో ప్రయాణికులు బావురుమంటున్నారు. ఇతర ఆప్సన్స్ లేకపోవడంతో అడిగినంత ఇచ్చి ఆటోలలో ప్రయాణించడం తప్ప వేరే మార్గం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.

చాలా మంది బైక్ టాక్సీలు మాత్రమే సరసమైన, నమ్మదగిన ఎంపికగా గుర్తిస్తుంటారు. నేను చాలాసార్లు ఆటో బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను.అయితే గమ్యస్థానం విన్న తర్వాత డ్రైవర్ దానిని రద్దు చేస్తాడు. చిక్కలసంద్ర బస్ స్టాప్ నుండి జయనగర్ BDA కాంప్లెక్స్ వరకు 3.9 కి.మీ ప్రయాణానికి బైక్ టాక్సీలు రూ. 50 వసూలు చేసేవి. ఇప్పుడు ఆటోలు రూ. 120 వసూలు చేస్తున్నాయి. అలాగే ధరలు నిర్ణయించే డ్రైవర్ల దయపై నేను ఎందుకు ఉండాలని చిక్కలసంద్ర నివాసి అనిత మురళి ప్రశ్నించారు.

Bike taxi ban in Karnataka Bengaluru bike taxi ban Karnataka transport news illegal bike taxis Bengaluru two-wheeler ban Bengaluru bike taxi crackdown Rapido ban Bengaluru Ola Uber bike ban Bengaluru traffic rules transport department Bengaluru Karnataka two-wheeler rules

ఆటో డ్రైవర్ల ఎక్కువ వసూలు: ఇది ఇతని ఒక్కడి బాధే కాదు. బెంగుళఊరు వ్యాప్తంగా చాలా మంది ఇదే రకమైన ఇబ్బందితో బాధపడుతున్నారు. బెంగళూరులో 2,500 కంటే ఎక్కువగానే ఆటో స్టాండులు ఉన్నాయి. వారంతా బుకింగ్ అడిగితే ఎక్కువ డబ్బును డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నియంత్రిత బైక్ టాక్సీలను ఎందుకు నిషేధిస్తోందని కోరమంగళకు చెందిన డేటా విశ్లేషకుడు కిషోర్ ఆర్ అడిగారు.సమస్య ప్లాట్‌ఫామ్ కాదని..నమ్మదగిన అంశాలు లేకపోవడమేనని చెబుతున్నారు. సిద్దరామయ్య ప్రభుత్వం ఆటోలను సరిచేయలేకపోతే కనీసం ఈ బైక్ ట్యాక్సీలను అయినా న్యాయంగా నడపనివ్వండి" అని రవాణా విధాన పరిశోధకుడు వినాయక్ దేశ్‌పాండే వాపోతున్నారు.

103 బైక్‌లను స్వాధీనం: ఇక హైకోర్టు ఆదేశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సోమవారం టాక్సీ సేవలు అందిస్తున్న బైకర్లపై చర్యలు తీసుకున్న రవాణా శాఖ మొత్తం 103 బైక్‌లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసింది.నగరంలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీల సందర్భంగా రవాణా శాఖ అధికారులు బైక్ టాక్సీ సేవలను అందిస్తున్న 103 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 103 బైక్‌లపై కేసు నమోదు చేసి, ఒక్కొక్కరికి రూ.5,000 జరిమానా విధించారు.

పార్శిల్ సేవను ప్రారంభించిన రైడర్స్ : ఓలా, ఉబర్, రాపిడో సహా అన్ని అగ్రిగేటర్లు బైక్ టాక్సీ సేవను నిలిపివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. బైక్ టాక్సీ సర్వీస్ ఎంపికను కూడా యాప్‌ల నుండి తొలగించారు. అయితే, ఓలా, ఉబర్, రాపిడో తాజాగా బైక్ పార్శిల్ సేవను ప్రారంభించాయి. టాక్సీ సేవకు బదులుగా, వినియోగదారులకు వస్తువులను డెలివరీ చేసే సేవను అందిస్తున్నారు. అయితే, ఈ సేవ పేరుతో బైకర్లు టాక్సీ సేవను కూడా అందిస్తున్నట్లు రవాణా శాఖ తెలుసుకుంది. దీంతో వీరిపై రవాణా శాఖ చర్యలు తీసుకుంది.

వైట్ బోర్డ్ వాహనాలు టాక్సీ సేవలను అందించలేవు: రాష్ట్ర రవాణా నిబంధనల ప్రకారం, బైక్ టాక్సీలు, వైట్ బోర్డ్ వాహనాలు టాక్సీ సేవలను అందించలేవు. బైక్ టాక్సీ సేవలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి నియమాలను రూపొందించలేదు. అయితే, ఓలా, ఉబర్, రాపిడో వంటి ఇతర కంపెనీలు బైక్ టాక్సీ సేవలను అందిస్తున్నాయి. ఈ విషయంలో హైకోర్టులో నిన్న పిటిషన్ విచారణకు వచ్చింది.ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనం జూన్ 15 తర్వాత రాష్ట్రంలో బైక్ టాక్సీ సేవలను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.

1 లక్ష ఉద్యోగాలు ప్రమాదంలో: బెంగళూరు నగరంతో పాటుగా కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా గిగ్ కార్మికులు బైక్ టాక్సీలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారని.. వారు కుటుంబ పోషణ కోసం రోజుకు 10 నుండి 12 గంటలు పనిచేస్తున్నారని అసోసియేషన్ తమ లేఖలో తెలిపింది. ఇప్పుడు బ్యాన్ చేస్తే జీవనాధారం లేక వీరంతా రోడ్డు మీదకు వస్తారని లేఖలో పేర్కొంది. ఇది సైడ్ ఆదాయం కాదని ప్రధాన వనరుగా వీరంతా బతుకుతున్నారని నిర్ణయాన్ని దయచేసి వెనక్కి తీసుకోవాలని లేఖలో నమ్మ బైక్ టాక్సీ అసోసియేషన్ కోరింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+