CEO Murdered Son: బెంగళూరుకు చెందిన ఒక ఏఐ స్టార్టప్ సీఈవోగా ఉన్న సుచనా సేథ్ దారుణానికి ఒడిగట్టింది. తన నాలుగేళ్ల కుమారుడిని కర్కశంగా చంపేయటం పెద్ద సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే నిందితురాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నిపుణురాలు. 39 ఏళ్ల సుచనా సేథ్ కేరళకు చెందిన వెంకట్ రామన్తో 2010లో వివాహం జరిగింది. 2019లో తల్లైన తర్వాత భర్తతో వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తాయి. ఆమె ప్రస్తుతం తన భర్త నుంచి విడాకుల కేసులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో వెంకట్ రామన్ కోరుకుంటే ప్రతి ఆదివారం తన కుమారుడిని కలవవచ్చని కోర్టు ఆదేశించింది. అయితే వెంకట్ తన కుమారుడిని చూడటం ఆమెకు అస్సలు ఇష్టం లేదు.

దీంతో ఆమెకు భర్తపై ఉన్న ద్వేషం తారా స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే సుచనా తన కుమారుడిని గోవాలోని హోటల్లో హతమార్చింది. ఆమె హోటల్ చెక్అవుట్ తర్వాత రక్తపు మరకలు గుర్తించిన సిబ్బంది విషయం పోలీసులకు వెల్లడించారు. సీసీ కెమెరా వివరాల ప్రకారం ఆమె ఒక పెద్ద బ్యాగ్ తీసుకెళ్లిందని వెంట కుమారుడు లేడని వారు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేదుకు బెంగళూరుకు టాక్సీలో బయలుదేరిందని పోలీసులు తెలుసుకున్నారు. హోటల్ సిబ్బందితో విమానానికి బదులు ఖర్చు ఎక్కువైనా పర్లేదంటూ క్యాబ్ బుక్ చేయించింది.
వెంటనే గోవా పోలీసులు సదరు క్యాబ్ డ్రైవర్ను సంప్రదించారు. దీంతో సదరు డ్రైవర్ కారును చిత్రదుర్గలోని మంగళ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. అక్కడ పోలీసులు విచారించగా బ్యాగులో చిన్నారి మృతదేహం లభ్యమైంది.ఇప్పుడు కోర్టు నుంచి అనుమతి తీసుకున్న పోలీసులు సూచనా సేథ్ను ట్రాన్సిట్ రిమాండ్కు తరలించి అరెస్ట్ చేసి గోవాకు తీసుకువస్తున్నారు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ వివరాల ప్రకారం సూచనా సేథ్ 2020లో AI మైండ్ఫుల్ ల్యాబ్స్ అనే స్టార్టప్ కంపెనీని స్థాపించారు. విషయం ఇండోనేషియాలో ఉన్న నిందితురాలి భర్త వెంకట్ రామన్కు పోలీసులు వెల్లడించారు. ఆయనను వెంటనే ఇండియా రావాల్సిందిగా కోరారు.
More From GoodReturns

Bengaluru: బడ్జెట్లో బెంగళూరు కోసం మాస్టర్ ప్లాన్..! రాబోతున్న కొత్త ప్రాజెక్టులు ఇవే!

బెంగళూరు ఆటో డ్రైవర్ల ఫోన్ వ్యసనంపై హాట్ డిబేట్.. సాప్ట్వేర్ ఇంజనీర్ ఆందోళనపై ఎవరేమన్నారంటే..

Bengaluru: స్టార్టప్ పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ ఎంట్రప్రెన్యూర్ చెప్తున్న చేదు నిజాలు వినాల్సిందే!

ఫ్రిజ్లో పండ్లు దొంగిలించిన పని మనిషి.. వెంటనే యజమానిని అలర్ట్ చేసిన AI..ఆ తర్వాత ఏమైందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications