BCCI: భారీగా ఆదాయం ఆర్జిస్తున్న బీసీసీఐ..
ప్రపంచంలో అత్యంత ధనికమైన క్రికెట్ బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ సంస్థ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI)కు పేరుంది. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (FY18-FY22) రూ. 27,411 కోట్ల మొత్తం ఆదాయాన్ని ఆర్జించింది. క్రికెట్ రెగ్యులేటరీ బాడీకి మీడియా హక్కులు, స్పాన్సర్షిప్లు, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) నుంచి ఆదాయం వస్తోంది. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి బీసీసీఐ రూ.1,159 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించింది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో, బీసీసీఐ ఆదాయపు పన్ను రూపంలో రూ. 844.92 కోట్లు చెల్లించింది. 2019-20లో చెల్లించిన రూ. 882.29 కోట్ల కంటే కొంచెం తక్కువగా ఉంది. FY2019లో బోర్డు రూ. 815.08 కోట్లను పన్నులుగా చెల్లించింది. 2017లో చెల్లించిన రూ. 596.63 కోట్ల కంటే ఎక్కువ. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి బీసీసీఐ రూ. 7,606 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, దాని ఖర్చు దాదాపు రూ. 3,064 కోట్లు. 2020-21లో దీని ఆదాయం రూ. 4,735 కోట్లు కాగా, ఖర్చులు రూ. 3,080 కోట్లుగా ఉంది.

ఆన్లైన్ వేలం ప్రక్రియను అనుసరించి ఏప్రిల్ 2018 నుండి మార్చి 2023 వరకు బీసీసీఐ భారతదేశ అంతర్జాతీయ, దేశీయ మీడియా హక్కులను స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గెలుచుకుంది. గ్లోబల్ కన్సాలిడేటెడ్ రైట్స్ ప్యాకేజీ కోసం అత్యధికంగా రూ.6,138 కోట్ల బిడ్ను నమోదు చేసింది. తాజాగా జియో సినిమా ప్రసార హక్కులు సొంతం చేసుకుంది. బీసీసీఐ ఒక్కో మ్యాచ్కు రూ.45 కోట్లు వసూలు చేస్తుంది. ద్వైపాక్షిక సిరీస్ల టీవీ, డిజిటల్ హక్కులను సైకిల్లోని 88 మ్యాచ్లకు (25 టెస్టులు, 27 ODI) వరుసగా ఒక్కో మ్యాచ్కు రూ. 200 మిలియన్ (రూ. 20 కోట్లు), రూ. 250 మిలియన్ (రూ. 25 కోట్లు) చొప్పున రెండు ప్యాకేజీలుగా విభజించారు.
బీసీసీఐకి ఐపీఎల్ ద్వారా కూడా భారీగా ఆదాయం వస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క 2023 ఎడిషన్ ప్రకటనల ఆదాయం రూ.10,120 కోట్లకు చేరుకుంది.బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా దాదాపు రూ. 2400 కోట్లకు పైగా ఆర్జించింది. మార్చి 4-26, 2023 వరకు ముంబైలో రెండు వేదికలపై జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభ సీజన్ నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రూ. 377.49 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.


Click it and Unblock the Notifications