రెండు బ్యాంకుల ప్రయివేటీకరణను నిరసిస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అంబరిల్లా ఈ నెల 16, 17వ తేదీన సమ్మెకు పిలుపు ఇచ్చింది. ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) జనరల్ సెక్రటరీ సంజయ్ దాస్ ఇటీవల మాట్లాడుతూ.. బ్యాంకుల ప్రయివేటీకరణ వల్ల ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు రుణ కేటాయింపులు ఇబ్బందికరంగా మారుతుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకుల ప్రయివేటీకరణను నిరసిస్తూ రెండు రోజుల సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కాగా, సమ్మెను విరమించుకోవాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలను స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా(SBI) సహా ఇతర PSBలు కోరాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమ్మె సరికాదని, ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని వీటిని దృష్టిలో పెట్టుకొని సమ్మె విరమణపై నిర్ణయం తీసుకోవాలని సూచించాయి. మంగళవారం వివిధ అంశాలపై చర్చించేందుకు రావాలని ఉద్యోగ సంఘాలకు సూచించాయి. రెండు రోజుల పాటు సమ్మె నిర్వహిస్తే ఆయా బ్యాంకుల కార్యకలాపాలు, ఏటీఎం కార్యకలాపాలపై ప్రభావం పడుతుంది.

ఎస్బీఐ, కెనరా బ్యాంకు, యూకో బ్యాంకు, సెంట్రల్ బ్యాంకులు కూడా సమ్మెను ఉపసంహరించుకోవాలని కోరాయి. ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఈ సమ్మె కారణంగా స్టేక్ హోల్డర్స్కు ఇబ్బందులు ఎదురవుతాయని ఎస్బీఐ విజ్ఞప్తి చేసింది. కస్టమర్లు, ఇన్వెస్టర్లు, బ్యాంకు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సమ్మెను ఉపసంహరించుకోవాలని కోరింది. కెనరా బ్యాంకు కూడా ట్వీట్ చేసింది. కస్టమర్లకు ఇబ్బందులు లేని నిరంతర సేవల కోసం సమ్మెను ఉపసంహరించుకోవాలని కోరింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications