BoB news: ఉపసంహరణకు, డిపాజిట్కు.. దేనికైనా ఛార్జీ
నవంబర్ 1వ తేదీ నుండి బ్యాంక్ ఆఫ్ బరోడా ఛార్జీ వసూలుకు సిద్ధమైంది. నెలలో మూడు కంటే ఎక్కువసార్లు సొమ్మును డిపాజిట్ చేస్తే రూ.40 చార్జీ చెల్లించాలి. నెలలో మూడు కంటే ఎక్కువసార్లు నగదును ఉపసంహరణ చేసుకుంటే రూ.100 చెల్లించాలి. అయితే ఉపసంహరణకు సంబంధించి ఏటీఎం మినహాయింపు ఉంది. జన్ ధన్ అకౌంట్లకు కూడా వర్తించదు. బ్యాంక్ ఆఫ్ బరోడా బాటలోనే బ్యాంక్ ఆఫ్ ఇండియా, PNB, యాక్సిస్, సెంట్రల్ బ్యాంకులు ఛార్జీల వసూలుకు సన్నద్ధమవుతున్నాయి.
ప్రయివేటురంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు డొమెస్టిక్ సేవింగ్స్ అకౌంట్స్ హోల్డర్లకు క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఏటీఎం ఇంటర్చేంజ్, చెక్ బుక్ ఛార్జీలు ఆగస్ట్ 1వ తేదీ నుండి మారాయి. బ్యాంకు వెబ్ సైట్ ప్రకారం ఐసీఐసీఐ ఖాతాదారులకు ఆరు మెట్రో నగరాల్లో మొదటి మూడు ట్రాన్సాక్షన్స్ అంటే ఫైనాన్షియల్, నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సేవలు ఉచితం. ఐసీఐసీఐ బ్యాంకు నగదు ట్రాన్సాక్షన్స్, ఏటీఎం ఇంటర్చేంజ్, చెక్ బుక్ ఛార్జీలు ఆగస్ట్ నుండి మారాయి.
ICICI బ్యాంకు ఏటీఎంలో నెలకు మొత్తం మూడు ఉచిత నగదు ట్రాన్సాక్షన్స్కు అనుమతి ఉంటుంది. ఇది ఆరు మెట్రో నగరాల్లో వర్తిస్తుంది. ఇతర లొకేషన్స్ అయితే మొదటి ఐదు ట్రాన్సాక్షన్స్ ఉచితం. ప్రతి అదనపు ట్రాన్సాక్షన్కు ఛార్జీ వసూలు చేస్తారు. - ప్రతి అదనపు ట్రాన్సాక్షన్ పైన (ఫైనాన్షియల్) రూ.20 ఛార్జీ వసూలు చేస్తారు. నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అయితే రూ.8.50 ఛార్జ్ చేస్తారు. - ఐసీఐసీఐ బ్యాంకు నెలకు నాలుగు క్యాష్ ట్రాన్సాక్షన్స్కు అనుమతి ఇస్తోంది.