గత కొన్ని రోజులుగా బ్యాంకుల విలీనం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గతంలో జరిగినట్టుగా మరోసారి ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది అంటూ వార్తలొస్తున్నాయి. అయితే ఇది నిజమయ్యేట్టు కనిపిస్తుంది. దీని గురించి ప్రముఖులు కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
దేశంలో మరోసారి బ్యాంకుల విలీనం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దీని గురించి మాట్లాడారు. బ్యాంకుల విలీనం, ప్రైవేటైజేషన్ మంచిదేనని అన్నారు. మన బ్యాంకులు అంతర్జాతీయ బ్యాంకులుగా ఎదగాలంటే చిన్న బ్యాంకులన్నీ కలిపి పెద్ద బ్యాంకులుగా ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో మరోసారి బ్యాంకుల విలీనం గురించి ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం ఉన్న బ్యాంకులను మెర్జ్ చేసి పెద్ద బ్యాంకులుగా తీర్చిదిద్దే అవకాశం కనిపిస్తోంది. అప్పుడే దేశంలో పెద్ద బ్యాంకులు ఏర్పడే అవకాశం ఉంటుంది.

గతంలో 2020 లో చిన్న ప్రభుత్వ బ్యాంకుల్ని పెద్ద బ్యాంకుల్లో విలీనం చేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో మెగా బ్యాంకుల విలీన ప్రక్రియకు కేంద్రం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న 12 ప్రభుత్వ బ్యాంకుల్ని.. 8 కి పరిమితం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియ అమలయ్యే అవకాశం ఉంది. తాజాగా SBI ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి కూడా ఈ బ్యాంకుల విలీనం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి విలీనం జరిగితే మంచిదేనని అన్నారు. విలీనం జరిగినా కూడా చిన్న బ్యాంకులు మనుగడలోనే ఉంటాయని ఆయన అన్నారు.
గతంలో ఇలా..
మన బ్యాంకులను అంతర్జాతీయ స్థాయిలో పోటీకి తట్టుకునేలా చేయడం కోసం ప్రభుత్వం కేంద్రం బ్యాంకుల విలీన ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా గతంలో ఉన్న 27 ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేసి 12కి తగ్గించింది. 2020 లో 10 చిన్న ప్రభుత్వ బ్యాంకులు 4 పెద్ద బ్యాంకులుగా మారాయి. ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం అయ్యాయి. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిపోయాయి. సిండికేట్ బ్యాంకు.. కెనరా బ్యాంకులో విలీనమైంది. ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకు విలీనమైంది.
ఇప్పుడు ఇలా..
ఇక ఇప్పుడు కాబోయే విలీన ప్రక్రియ విషయానికొస్తే.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో.. బ్యాంక్ ఆఫ్ ఇండియాను విలీనం చేసే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు SBI తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే రెండో అతిపెద్ద బ్యాంకుగా మారుతుంది. అలాగే SBI లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి చిన్న బ్యాంకులు విలీనం అయ్యే అవకాశం కనిపిస్తోంది. లేదా వీటిలో కొన్నింటిని పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేయొచ్చు. ఒకవేళ విలీనం జరిగితే.. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు వంటి పెద్ద బ్యాంకులే చెలామణిలో ఉంటాయి. ఆయా బ్యాంకుల కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారు కొత్త బ్యాంకుకి కస్టమర్లుగా మారతారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications