Bank Charges: ప్రస్తుతం భారత బ్యాంకింగ్ రంగం మంచి జోరు మీద ఉంది. జూన్ తో ముగిసిన త్రైమాసికానికిగాను దాదాపు బ్యాంకులన్నీ పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేశాయి. అయితే ఇందులో కొంత భాగం ఖాతాదారుల ముక్కుపిండి వసూలు చేసింది కావడం గమనార్హం. వివిధ రకాల ఛార్జీలు వినియోగదారులపై బాది భారీ మొత్తాన్ని బ్యాంకులు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది.
దేశంలోని ప్రభుత్వం రంగ బ్యాంకులతోపాటు ప్రైవేటు రంగానికి చెందిన HDFC, ICICI, యాక్సిస్, ఇండస్ ఇండ్, IDBIలు ఈ ఛార్జీల ద్వారా పెద్ద మొత్తంలో లబ్ధి పొందినట్లు సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖే ప్రకటించింది. 2018 నుంచి 35 వేల కోట్లకు పైగా వినియోగదారుల నుంచి ఛార్జీల రూపంలో వసూలు చేస్తున్నట్లు పార్లమెంటుకు వెల్లడించింది.

ఖాతాలో మినిమం బాలన్స్ మెయింటెనె చేయనందుకు, పరిమితికి మించి ATM ద్వారా లావా దేవీలు జరిపినందుకు, SMS సేవలు అందించినందుకుగాను ఈ మొత్తాన్ని వసూలు చేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగత్ కరద్ రాజ్యసభకు వివరించారు. కనీస నిల్వ కేటగిరీ నుంచి 21 వేల కోట్లు, ATM ఛార్జీలు కింద 8 వేల కోట్లు, SMS సేవల ద్వారా 6 వేల కోట్లకు పైగా సేకరించినట్లు రాతపూర్వకంగా తెలియజేశారు.
ప్రధానమంత్రి జన్ ధన్ ఖాతాలు మినహా అన్ని రకాల సేవింగ్స్ అకౌంట్స్ లో మినిమం బాలన్స్ ఉంచాల్సి ఉంటుంది. నెలకు 5 ATM లావాదేవీలను ఆయా బ్యాంకులు ఉచితంగా అందిస్తున్నాయి. పరిమితికి మించి డ్రా చేస్తే ట్రాన్సాక్షన్ కు 21 చొప్పున సమర్పించుకోవాల్సి వస్తుంది. ఇక బ్యాంకు ఖాతా ద్వారా జరిగే ప్రతి లావాదేవీలను ఎప్పటికప్పుడు కస్టమర్స్ మెసేజ్ రూపంలో పొందడం కోసం బ్యాంకులు SMS ఛార్జీలను విధిస్తున్నాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications