Home Loan: మీరు హోం లోన్ తీసుకున్నారా.. అయితే మరింత భారం తప్పదు..!
ద్రవ్యల్బణాన్ని అదుపులోకి తీసుకురావడానికి ఆర్బీఐ రెపో రేటును మరోసారి పెంచింది. దీంతో బ్యాంకుల్లో లోన్ తీసుకున్న వారి ఈఎంఐ పెరగనుంది. ముఖ్యంగా హోం లోన్ తీసుకున్న వారి భారం ఎక్కువగా పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే రుణం తీసుకున్న వారికి వడ్డీ రేటు పెరిగినా, నెలవారీ చెల్లించాల్సిన వాయిదా (EMI)లో మార్పు ఉండదు కానీ రుణం చెల్లించాల్సిన వ్యవధి పెరుగుతుంది.
రూ. 50 లక్షల రుణానికి..
ఉదాహరణకు ఎస్బీఐలో రూ. 50 లక్షల హోం తీసుకున్నారనుకుంటే.. 240 నెలలు వ్యవధి ఉంది అనుకుంటే ప్రస్తుత SBI వడ్డీ రేటు 7.65 ప్రకారం నెలకు రూ.40,739 చెల్లించాల్సి ఉంటుంది. అయితే అర్బీఐ రేపో రేటు 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. ఒక వేళ బ్యాంకుల కూడా 50 బేసిస్ పాయింట్లు పెంచితే హోం లోన్ తీసుకున్న వారిపై భారం పడుతుంది.
ఈఎంఐ పెరుగుతుంది..
పై కేసులో వడ్డీ రేటు పెరిగితే పాత ఈఎంఐలో ఎలాంటి మార్పు చేయకపోతే లోన్ వ్యవధి 265 నెలలకు పెరుగుతుంది. వ్యవధి 240 నెలలే ఉంచుకుంటే ఈఎంఐ పెరుగుతుంది. వడ్డీ రేటు పెరిగితే ఈ కేసులో నెలకు రూ.42,289 చెల్లించాల్సి ఉంటుంది. అది 240 నెలల కాలానికి. దాదాపు అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది.
పెంపు ఇంకా ఉంటుందా..
ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోతే.. వడ్డీరేట్ల పెంపు విషయంలో భవిష్యత్తులో ఆర్బీఐ మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వడ్డీ రేట్లు ఇప్పుడున్న స్థాయి నుంచి మరో 35-50 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో లోన్లు తీసుకున్నవారి మరింత భారం పడే అవకాశం ఉంది.