For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు: దెబ్బతీసిన బ్యాంక్, ఐటీ స్టాక్స్

|

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (ఫిబ్రవరి 17) భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం దాదాపు నాలుగు వందల పాయింట్ల నష్టంతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా తీవ్ర ఒడిదుడుకుల్లో కదలాడాయి. చివరకి దాదాపు ప్రారంభంలోని నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ కష్టంగా 15,200 పాయింట్ల పైన ముగిసింది. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ 9 శాతం, నెస్ట్లే 3 శాతం నష్టపోయాయి. బ్యాంకు, ఐటీ స్టాక్స్ భారీగా నష్టపోవడంతో సూచీలు పతనమయ్యాయి. సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో 22 నష్టాల్లో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంకింగ్ ర్యాలీ కొనసాగించాయి. సెన్సెక్స్ 52,000 పాయింట్ల దిగువన ముగిసింది.

2021లో ఇన్వెస్ట్ చేయండి, ఈ ఏడాది బెస్ట్ ప్రభుత్వ పథకాలు.. తెలుసుకోండి2021లో ఇన్వెస్ట్ చేయండి, ఈ ఏడాది బెస్ట్ ప్రభుత్వ పథకాలు.. తెలుసుకోండి

నష్టాల్లో ముగింపు

నష్టాల్లో ముగింపు

సెన్సెక్స్ 400.34 పాయింట్లు లేదా 0.77% నష్టపోయి 51,703.83 పాయింట్ల వద్ద, నిఫ్టీ 104.60 పాయింట్లు లేదా 0.68% క్షీణించి 15,208.90 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1480 షేర్లు లాభాల్లో, 1422 షేర్లు నష్టాల్లో ముగియగా, 144 షేర్లలో ఎలాంటి మార్పులేదు. సెన్సెక్స్ 51,996.94 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,078.15 వద్ద గరిష్టాన్ని, 51,586.34 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. డాలర్ మారకంతో రూపాయి స్వల్పంగా క్షీణించి 72.75 వద్ద క్లోజ్ అయింది. ఉదయం 72.92 వద్ద ప్రారంభమైంది. నేటి సెషన్లో 72.72-72.93 మధ్య ట్రేడ్ అయింది.

నేటి టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో హీరో మోటోకార్ప్ 3.54 శాతం, అదానీ పోర్ట్స్ 3.02 శాతం, SBI 2.34 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.10 శాతం, HDFC లైఫ్ 2.02 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో నెస్ట్లే 2.76 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 2.63 శాతం, ఏషియన్ పేయింట్స్ 2.53 శాతం, మారుతీ సుజుకీ 2.52 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 2.47 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, రిలయన్స్, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంకు ఉన్నాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు 0.96 శాతం లాభపడి రూ.2080 వద్ద ట్రేడ్ అయింది.

రంగాలవారీగా...

రంగాలవారీగా...

నిఫ్టీ 50 స్టాక్స్ 0.68 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.32 శాతం లాభపడ్డాయి.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.28 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.97 శాతం, నిఫ్టీ మీడియా 2.18 శాతం, నిఫ్టీ మెటల్ 0.17 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 5.86 శాతం, లాభపడ్డాయి.నిఫ్టీ బ్యాంకు 0.51 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.10 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.61 శాతం, నిఫ్టీ ఐటీ 1.29 శాతం, నిఫ్టీ ఫార్మా 1.72 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.64 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.95 శాతం నష్టపోయాయి.

English summary

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు: దెబ్బతీసిన బ్యాంక్, ఐటీ స్టాక్స్ | Bank, IT and FMCG stocks send Sensex 400 points lower

Among sectors, PSU Bank index rallied nearly 6 percent, while some buying also seen in the energy, infra and auto names. However, selling seen in the FMCG, IT, pharma stocks.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X