బ్యాంకు ఉద్యోగులకు గుడ్న్యూస్...ఇకనుంచి వారికి ఐదురోజుల పనిదినాలు మాత్రమే వర్తించనున్నాయి. బ్యాంకు ఉద్యోగుల సుదీర్ఘ డిమాండ్ అయిన ఐదు రోజుల పనిదినాల కల ఈ సంవత్సరం నెరవేరబోతుంది. దాంతోపాటే వేతన పెంపు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డిమాండ్కు ఇక ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి ఆమోదం మాత్రమే రావాల్సి ఉంది. ఈ ఏడాది జూన్ నెల నుంచే ఈ ఐదు రోజుల పనిదినాల విధానం అమల్లోకి రానుంది.
బ్యాంకింగ్ రంగంలో వారానికి ఐదు రోజుల పనిదినాలు మాత్రమే అమలు చేయాలంటూ బ్యాంకు ఉద్యోగులతో కూడిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్కు గతంలో ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల పని వల్ల బ్యాంక్ ఖాతాదారులకు సేవలు అందించే పని గంటలు ఏమాత్రం తగ్గిపోవని, అలాగే ఉద్యోగులు, అధికారుల మొత్తం పనిగంటల్లోనూ ఎలాంటి మార్పులు ఉండవని అందులో హామీ ఇవ్వడం జరిగింది.

వారంలో ఐదురోజుల పనిదినాలు ఇప్పటికే ఇప్పటికే ఆర్బిఐ, ఎల్ఐసీ సంస్థల్లో అమల్లో ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని సమీక్షించి తమకు అనుకూలంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియషన్కు ఆదేశాలు జారీ చేయాలని బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ కోరింది.
రెండు రోజుల సెలవుతో పాటు వేతనపెంపు...
వారంలో ఐదురోజులు మాత్రమే బ్యాంక్ ఉద్యోగులు పనిదినాలు కల్పించాలనే డిమాండ్ ఇప్పటిది కాదు. ఇది 2015 నుంచి వున్నదే. ప్రస్తుతం నెలలో ప్రతి రెండు, నాలుగో శనివారం బ్యాంకులు సెలవు పాటిస్తున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంకు ఉద్యోగుల సంఘాల మధ్య జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ఉద్యోగులకు 17 శాతం వేతనం పెరిగింది.
కేంద్రప్రభుత్వం గనుక అమోదం తెలిపితే ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు రంగంలో 3.8 లక్షలమంది అధికారులు సహా తొమ్మిది లక్షలమంది బ్యాంకు ఉద్యోగులకు వారానికి రెండు రోజుల వీక్లీ ఆఫ్ లభించనుంది, వీటితోపాటు వేతనపెంపు కూడా వర్తించనుంది. ఇది ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నింటికీ వర్తిస్తుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications