Bangalore News: ఎలక్ట్రానిక్స్ నగరం బెంగళూరులో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. వేసవి ప్రారంభంతోనే తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడింది. ఎండలు మరింత ముదురుతుండడంతో రానున్న రోజులు ఎలా ఉండనున్నాయో అని అందరిలోనూ ఆందోళన నెలకొంది. దీని ప్రభావం విద్యార్థులు, IT ఉద్యోగులపైనా పడింది. దీంతో టెక్కీలు సహా పౌర సమాజం కొత్త డిమాండ్లను తెరపైకి తీసుకొస్తోంది.
నగరంలో ఏర్పడిన నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని పాఠశాలలు, IT కంపెనీల విషయంలో అధికారులు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తులు వెలువెత్తుతున్నాయి. IT ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం, విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులను తిరిగి అమలు చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ మేరకు పౌరులు సహా సామాజికవేత్తలు, న్యాయవాదులు.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

కరోనా విజృంభణ సమయంలో పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ క్లాస్ లను అమలు చేసింది. కాగా ఇప్పుడు కూడా దరిదాపుల్లో అత్యవసర పరిస్థితి కాచుకుని కూర్చోవడంతో అదే విధానాన్ని ఎందుకు కొనసాగించకూడదని ప్రశ్నిస్తున్నారు. ఇంటి నుంచి పనిచేసే ఆప్షన్స్ ఇస్తే ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు తమ స్వస్థలాలకు మళ్లుతారు. తద్వారా నగరంపై నీటి డిమాండ్ భారీగా తగ్గే అవకాశం ఉందని గుర్తు చేస్తున్నారు.
వాతావరణ శాఖ కూడా మార్చి నుంచి మే వరకు సాధారణం కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని ముందే హెచ్చరించింది. ఫిబ్రవరిలోనూ వర్షపాతం నమోదు కాలేదు. ఎల్నినో, గ్లోబల్ వార్మింగ్ వల్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పర్యవసానాలను లోతుగా అధ్యయనం చేసి సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
More From GoodReturns

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications