Bonus Shares: ఉచితంగా షేరుకు షేరు బహుమతి.. 17 ఏళ్ల తర్వాత కంపెనీ నిర్ణయం, లాస్ట్ డేట్ అదే..
Banco Products Share: దేశీయ స్టాక్ మార్కెట్లు గతవారం భారీ పతనాన్ని చూసిన తర్వాత నేడు తిరిగి బుల్ జోరును సంతరించుకున్నాయి. ఈ క్రమంలో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముందుకు సాగుతుండగా.. త్రైమాసిక ఫలితాల తర్వాత కంపెనీలు తమ ఇవ్వెస్టర్లకు అందిస్తున్న ఉచిత షేర్లపై కొందరు ఇన్వెస్టర్ల దృష్టి కొనసాగుతోంది. బోనస్ షేర్ల కోసం వేటాడుతున్న ఇన్వెస్టర్లకు ప్రస్తుతం సదవకాశం ఉంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది బ్యాంకో ప్రొడక్ట్స్ లిమిటెడ్ కంపెనీ గురించే. త్రైమాసిక ఫలితాల తర్వాత కంపెనీ తన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లు ఇవ్వాలని నిర్ణయించింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత కంపెనీ తన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను పంపిణీ చేయటంతో ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కంపెన అర్హులైన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై మరో ఉచిత షేరును బోనస్ రూపంలో అందించాలని నిర్ణయించింది. అయితే షేర్లను పొందటం కోసం రికార్డు తేదీని డిసెంబర్ 31, 2024గా నిర్ణయించింది.

కంపెనీ ప్రకటించిన దాని ప్రకారం ఎవరైనా ఇన్వెస్టర్ బోనస్ షేర్లను పొందటానికి శనివారంలోపు తమ డీమ్యాట్ ఖాతాలో కంపెనీ షేర్లను కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే కంపెనీ బుక్స్ ప్రకారం మీరు షేర్ హోల్డరుగా బోనస్ షేర్లను పొందటానికి అర్హత పొందుతారని గుర్తుంచుకోవాలి. దీనికి ముందు డిసెంబర్ 21న ఎక్స్ఛేంజీకి ఇచ్చిన సమాచారంలో అర్హులైన ఇన్వెస్టర్లకు ఒక షేరుపై షేర్ బోనస్ ఇవ్వబడుతుందని వెల్లడించింది. కంపెనీ ఈ బోనస్ ఇష్యూకి రికార్డు తేదీని డిసెంబర్ 30, 2024గా నిర్ణయించింది. అంటే కంపెనీ వచ్చే వారం సోమవారం ఎక్స్-బోనస్ స్టాక్గా ట్రేడ్ అవుతుంది. మీరు ఉచిత షేర్లను పొందటానికి అర్హత కలిగి ఉండాలంటే శుక్రవారం నాటికి స్టాక్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
చివరిగా బోనస్ షేర్లు..
బ్యాంకో ప్రొడక్ట్స్ కంపెనీ చివరిగా తన ఇన్వెస్టర్లకు 2007లో బోనస్ షేర్లను ప్రకటించింది. అయితే కంపెనీ నిరంతరం తన పెట్టుబడిదారులకు డివిడెండ్లు చెల్లిస్తోంది. బాంకో ఉత్పత్తుల షేర్లు ఫిబ్రవరి 2024లో ఎక్స్-డివిడెండ్ని ట్రేడ్ చేశాయి. అప్పుడు కంపెనీ ఒక షేరుపై రూ.20 డివిడెండ్ ఇచ్చింది. 2023లో కూడా రెండుసార్లు డివిడెండ్ చెల్లించింది. అలాగే దీర్ఘకాలికంగా కంపెనీలో పెట్టుబడులను కలిగి ఉన్న ఇన్వెస్టర్లు మంచి రాబడులను సైతం అందుకున్నారు. రెండేళ్ల కాలంలో 400 శాతం రాబడిని అందించింది. ఎన్ఎస్ఈలో కంపెనీ షేర్లు మధ్యాహ్నం 12 గంటలకు 3.42 శాతం నష్టంతో రూ.965.30 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications