Gold Price Today: రోజు రోజుకూ పసిడి ధరలు పెరుగుతూపోతున్నాయి. వాస్తవానికి 2024లో భారతీయులు గోల్డ్ ఎక్కువగా కొనుగోలు చేసి ఏకంగా చైనాను వెనక్కి నెట్టారు. ఈ క్రమంలో భారతీయులు 563.4 టన్నుల పసిడి ఆభరణాలను కొనుగోలు చేసి ప్రపంచంలో గోల్డ్ వినియోగం మెుదటి స్థానంలో నిలిచారు. కానీ ఇప్పుడు పరిస్థిలు పూర్తిగా మారిపోయాయి. నిరంతరం పెరుగుతున్న రేట్లు భారతీయ కొనుగోలుదారులను నిరాశకు గురిచేస్తున్నాయి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.2500 పెరిగింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7930, ముంబైలో రూ.7930, దిల్లీలో రూ.7945, కలకత్తాలో రూ.7930, బెంగళూరులో రూ.7930, కేరళలో రూ.7930, పూణేలో రూ.7930, వడోదరలో రూ.7935, జైపూరులో రూ.7945, లక్నోలో రూ.7945, కోయంబత్తూరులో రూ.7930, మంగళూరులో రూ.7906, నాశిక్ లో రూ.7909, అయోధ్యలో రూ.7921, బళ్లారిలో రూ.7906, గురుగ్రాములో రూ.7921, నోయిడాలో రూ.7921 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.2700గా ఉంది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగి రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8651, ముంబైలో రూ.8651, దిల్లీలో రూ.8666, కలకత్తాలో రూ.8651, బెంగళూరులో రూ.8651, కేరళలో రూ.8651, పూణేలో రూ.8651, వడోదరలో రూ.7935, జైపూరులో రూ.8666, లక్నోలో రూ.8666, కోయంబత్తూరులో రూ.8651, మంగళూరులో రూ.8625, నాశిక్ లో రూ.8628, అయోధ్యలో రూ.8640, బళ్లారిలో రూ.7906, గురుగ్రాములో రూ.8640, నోయిడాలో రూ.8640గా ఉన్నాయి. అయితే ఈ ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి, వ్యాపారి లాభాలు వంటివి కలపకముందువిగా గుర్తుంచుకోవాలి.
తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7930గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8651 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,07,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
గోల్డ్ రేట్ల ర్యాలీ ఎందుకు..?
ప్రస్తుతం పెరుగుతున్న పసిడి ధరలు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. వాస్తవానికి అమెరికా తాజా ట్రేడ్ టారిఫ్స్ కారణంగా ముందస్తు వ్యూహాత్మక రక్షణ చర్యల్లో భాగంగా చైనా నుంచి పసిడి డిమాండ్ పెరగటంతో అంతర్జాతీయంగా పసిడి ధరలు సరికొత్త రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. ప్రస్తుతం చైనా-యూఎస్ ట్రేడ్ వార్ కారణంగా అప్రమత్తమైన ప్రపంచ దేశాల నుంచి కూడా పసిడికి డిమాండ్ పెరుగుతోంది. దీనికి అదనంగా అమెరికా జాబ్ డేటా, ద్రవ్యోల్బణం, నెమ్మదిగా కొనసాగుతున్న ఆర్థిక వ్యవస్థ వంటి ఇతర కారణాలు సైతం పసిడి పరుగుకు కారణంగా ఉన్నాయి.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications