బ్యాంకులకు మొండి బాకీలు పెరిగిపోతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో బ్యాండ్ బ్యాంక్ ఏర్పాటు తప్పనిసరి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు తప్పనిసరి మాత్రమే కాదని, అనివార్యం కూడా అన్నారు. కరోనా సంక్షోభంతో బ్యాంకింగ్ రంగంలో ఎన్పీఏల సమస్య నుండి గట్టెక్కేందుకు పబ్లిక్ సెక్టార్ అసెట్స్ రిహాబిలిటేషన్ ఏజెన్సీ(PARA) పేరుతో బ్యాడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేయాలని 2017 ఎకనమిక్ సర్వే కూడా సూచించింది.

బ్యాడ్ బ్యాంక్ కోసం ఆ విధానాలు..
బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుతో మొండి బకాయిల పరిష్కారంలో పరస్పర ప్రయోజన వివాదాలు, అవినీతిని నివారించవచ్చునని సుబ్బారావు తెలిపారు. బ్యాడ్ బ్యాంక్స్ కొన్ని విజయవంతమయ్యాయని, ఇందుకు ధనహర్తా ఆఫ్ మలేషియా మంచి ఉదాహరణ అన్నారు. దీని విధివిధానాలను మన వద్ద బ్యాడ్ బ్యాంక్ కోసం తీసుకోవచ్చునని చెప్పారు. దీనిపై అధ్యయనం చేయాలన్నారు. సాధారణ బ్యాంకులతో పోలిస్తే మొండి బకాయిల విషయంలో బ్యాడ్ బ్యాంకులు త్వరితగతిగా, క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయన్నారు.

ఇదీ బ్యాడ్ బ్యాంక్
వివిధ బ్యాంకుల్లోని మొండి బాకీల ఖాతాలను అన్నింటిని ఒక సంస్థకు బదలీ చేసి వెంటనే ఆ ఖాతాలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలనే వాదన ఎప్పటి నుండో ఉంది. ఇలాంటి సంస్థనే బ్యాడ్ బ్యాంక్ అని వ్యవహరిస్తున్నారు. సాంకేతికంగా బ్యాడ్ బ్యాంకును రుణ పునర్వ్యవస్థీకరణ కంపెనీగా పిలుస్తారు. వాణిజ్య బ్యాంకుల నుండి రాయితీపై ఎన్పీఏలను ఈ బ్యాడ్ బ్యాంకు కొనుగోలు చేస్తుంది. ఆ తర్వాత సదరు రుణగ్రహీతల నుండి నిర్ణీత సమయంలో వసూలు చేసుకుంటుంది.

వృద్ధి రేటు పతనం
మన దేశంలో వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరంలో బాగా పతనమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మొండి బాకీలు భారీగా పెరిగిపోతున్నట్లు చెప్పారు దువ్వూరి సుబ్బారావు. 2020 మార్చి నాటికి దేశీయంగా బ్యాంకులకు మొండి బాకీలు 8.5 శాతం ఉండగా, వచ్చే ఏడాది మార్చినాటికి 12.5శాతానికి పెరిగే అవకాశముందని ఆర్బీఐ నివేదిక పెరిగింది.

ఆ భారం మోయలేదు.. బ్యాడ్ బ్యాంక్పై దృక్పథం మారింది
ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(IBC) ద్వారా మొండి బకయిల సమస్ పూర్తిగా పరిష్కారమయ్యే అవకాశం లేదని డీ సుబ్బారావు చెప్పారు. ఇప్పటికే IBC వ్యవస్థ మీద మోయలేనంత పనిభారం ఉందన్నారు. ఈ వ్యవస్థ ఎన్పీఏల అదనపు భారాన్ని మోయలేదన్నారు. బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుకు సంబంధించి గతంలో తనకు కొన్ని అభ్యంతరాలు ఉండేవని, ఇటీవలి కాలంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ బ్యాంక్ ఏర్పాటుపై తన దృక్పథం మారిందన్నారు. దివాలా చట్టంతో ఎన్పీఏల పరిష్కారం గాడిన పడుతుందని భావించినప్పటికీ, క్రమంగా విశ్వాసం సన్నగిల్లినట్లు చెప్పారు. బ్యాంకులు తమ అవసరాలకు తగినంత మూలధనాన్ని సమకూర్చుకోవడం కూడా సమస్యేనని సుబ్బారావు అన్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications