Patanjali News: దేశంలో అనేక ఆయుర్వేద ఉత్పత్తులతో పాటు ఎఫ్ఎంసీజీ రంగంలో బలమైన మార్కెట్ కలిగిఉన్న కంపెనీ పతంజలి. దీనిని ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ స్థాపించారు.
అయితే ఇప్పుడు పతంజలి తన వ్యాపారాలను సాంకేతిక రంగంలోకి విస్తరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పతంజలి అప్పుల ఒప్పందంలో కూరుకుపోయిన రోల్డా ఇండియా సంస్థను రూ.830 కోట్ల నగదు ఒప్పందంతో సొంతం చేసుకునేందుకు ముందుకు వచ్చింది. పూణేకు చెందిన అష్టన్ ప్రాపర్టీస్కు గత వారాంతంలో రోల్డా ఇండియా వేలంపాటలో కంపెనీకి రుణాలు ఇచ్చిన బ్యాంకులు నిర్వహించిన వేలంలో అధిక ధరను తొలుత బిడ్ చేసింది. అయితే పతంజలి దీనికి మించిన మెుత్తాన్ని ఆఫర్ చేస్తూ ఎన్సీఎల్టీని సంప్రదించింది.

రోల్డా ఇండియా అనేది 1989లో స్థాపించబడిన కమల్ సింగ్ నేతృత్వంలోని సెక్యూరిటీ సాఫ్ట్వేర్ కంపెనీ. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ ఐటీ, బిజినెస్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్, జియోగ్రాఫిక్ డేటా, ఇన్ఫర్మేషన్ అండ్ ఇంజినీరింగ్ విభాగాల్లో సేవలను అందిస్తోంది. అయితే కంపెనీ 2023 జనవరిలో దివాలా తీసినట్లు ప్రకటించబడింది. ఆ సమయంలో యూనియన్ బ్యాంక్ కన్సార్టియం రూ.7,100 కోట్లు, సిటీ గ్రూప్ నేతృత్వంలోని అసురక్షిత విదేశీ బాండ్ హోల్డర్లకు రూ.6,699 కోట్ల రుణాన్ని చెల్లించాల్సి ఉంది. మొత్తం రూ.14,000 కోట్ల అప్పులతో చివరికి దివాళా తీసింది.
బ్యాంకులు నిర్వహించిన వేలంలో రోల్డా ఇండియా దాదాపు రూ.760 కోట్ల నికర ప్రస్తుత విలువ ప్రాతిపదికన అష్టన్ ప్రాపర్టీస్ కంటే ఎక్కువ ధర పలికిందని బ్యాంకులు తెలిపాయి. ఇది మెుత్తం అప్పుల్లో 6 శాతం కంటే తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే వారం ప్రారంభంలో పతంజలి ఆయుర్వేద తన బిడ్ను పరిగణనలోకి తీసుకునేలా రుణదాతలను ఆదేశించాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లోని ముంబై బెంచ్ను ఆశ్రయించింది. పతంజలి ఆయుర్వేద బిడ్డింగ్ మొత్తం రూ.820 కోట్ల నుంచి రూ.830 కోట్లుగా ఉందని సమాచారం.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications