రుచి సోయా బోర్డులోకి బాబా రామ్దేవ్, చైర్మన్గా సోదరుడు రామ్ భరత్
రుచి సోయా మేనేజింగ్ డైరెక్టర్గా యోగా గురువు బాబా రామ్దేవ్ సోదరుడు రామ్ భరత్ నియమితులయ్యారు. 2020 ఆగస్ట్ 19వ తేదీన జరిగిన బోర్డు సమావేశంలో డైరెక్టర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రుచి సోయా తెలిపింది. రామ్ భరత్ నియామకం 2020 ఆగస్ట్ 19వ తేదీ నుండి అమలులోకి వచ్చిందని, 2022 డిసెంబర్ 17వ తేదీ వరకు పదవిలో ఉంటారని వెల్లడించింది.
యోగా గురువు బాబా రామ్దేవ్ను బోర్డు డైరెక్టర్గా నియమించేందుకు కూడా వాటాదారుల అనుమతిని కోరింది రుచి సోయా. దివాలా తీసిన రుచి సోయా ఇండస్ట్రీని గత ఏడాది పతంజలి ఆయుర్వేద లిమిటెడ్, దివ్య యోగ్ మందిర్ ట్రస్ట్, పతంజలి పరివర్తన్ ప్రయివేటు లిమిటెడ్, పతంజలి గ్రామోద్యోగ్ సంస్థలతో కూడిన కన్సాక్టియం కొనుగోలు చేసింది. దీంతో ఆ కంపెనీ డైరెక్టర్ల బోర్డును నియమించే హక్కు కొత్త యాజమాన్యానికి లభించినట్లు రుచి సోయా ఇండస్ట్రీస్ తెలిపింది.
గత ఏడాది దివాలా ప్రక్రియలో భాగంగా రుచి సోయాను పతంజలి గ్రూప్ కనుగోలు చేసిన నేపథ్యంలో బోర్డు సభ్యులను నియమించే హక్కును కొత్త యాజమాన్యం పొందినట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఎండీగా నియమించిన రామ్ భరత్కు వార్షిక వేతనం రూ.1 చెల్లించనున్నట్లు తెలిపింది. ఆచార్య బాలకృష్ణ హోదాను చైర్మన్గా మార్చింది. ఇతని వార్షిక వేతనం కూడా రూ.1.